సీబీఐ వదల బొమ్మాళి అంటోంది. వైఎస్ వివేనానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రాకుండా జాప్యం చేసే వారిని వెంటబడి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతటివారైనా సరే సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చి వస్తున్నారు. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది….
సోమవారం హాజరు కావాలని అవినాష్ కు ఇటీవల సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. తేదీ మార్చడం కుదరదని చెప్పేశారు. అయితే ముందుగా నిర్ణయించిన సమావేశాలు ఉన్నందున సోమావరం రాలేనని అవినాష్ లేఖ పంపారు. పులివెందుల, వేంపల్లెలో కార్యకర్తల సమావేశాలున్నాయని అవినాష్ చెఫ్పుకొచ్చారు. మరో రోజున వస్తానని హామీ ఇచ్చారు.
ఆదివారం అవినాష్ లేఖ అందిన వెంటనే సీబీఐ అధికారులు వేగంగా స్పందించారు. మరో నోటీసు తీసుకెళ్లి పులివెందులలో ఆయన ఇంటిలో అందజేశారు. పదవ తేదీన హాజరు కావాలని అందులో ప్రస్తావించారు. ఆదివారం రాత్రి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు, పదో తేదీన హైదరాబాద్ లో హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ కు తెలిపారు. అంటే అవినాష్ సీబీఐ ముందు మూడో సారి హాజరవుతున్నారన్నమాట. అవినాష్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సీబీఐ అధికారులు… ఆయన లాయర్లను కూడా బయటనే ఉంచుతున్నారు.
అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న కడపలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారుు. ఈ నోటీసులు రెండుమూడు రోజుల క్రితమే భాస్కర్ రెడ్డికి అందినట్లు సమాచారం. వివేకా కేసులో కీలకాంశాలను బేరీజు వేసుకునేందుకు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడం అనివార్యమవుతుందని సీబీఐ అంటోంది.
This post was last modified on March 6, 2023 12:21 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…