సీబీఐ వదల బొమ్మాళి అంటోంది. వైఎస్ వివేనానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రాకుండా జాప్యం చేసే వారిని వెంటబడి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతటివారైనా సరే సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చి వస్తున్నారు. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది….
సోమవారం హాజరు కావాలని అవినాష్ కు ఇటీవల సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. తేదీ మార్చడం కుదరదని చెప్పేశారు. అయితే ముందుగా నిర్ణయించిన సమావేశాలు ఉన్నందున సోమావరం రాలేనని అవినాష్ లేఖ పంపారు. పులివెందుల, వేంపల్లెలో కార్యకర్తల సమావేశాలున్నాయని అవినాష్ చెఫ్పుకొచ్చారు. మరో రోజున వస్తానని హామీ ఇచ్చారు.
ఆదివారం అవినాష్ లేఖ అందిన వెంటనే సీబీఐ అధికారులు వేగంగా స్పందించారు. మరో నోటీసు తీసుకెళ్లి పులివెందులలో ఆయన ఇంటిలో అందజేశారు. పదవ తేదీన హాజరు కావాలని అందులో ప్రస్తావించారు. ఆదివారం రాత్రి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు, పదో తేదీన హైదరాబాద్ లో హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ కు తెలిపారు. అంటే అవినాష్ సీబీఐ ముందు మూడో సారి హాజరవుతున్నారన్నమాట. అవినాష్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సీబీఐ అధికారులు… ఆయన లాయర్లను కూడా బయటనే ఉంచుతున్నారు.
అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న కడపలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారుు. ఈ నోటీసులు రెండుమూడు రోజుల క్రితమే భాస్కర్ రెడ్డికి అందినట్లు సమాచారం. వివేకా కేసులో కీలకాంశాలను బేరీజు వేసుకునేందుకు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడం అనివార్యమవుతుందని సీబీఐ అంటోంది.
This post was last modified on March 6, 2023 12:21 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…