Political News

జగన్ ను ఇరకాటంలో పెట్టిన టీడీపీ పథకం ఇదేనా?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను బట్టి ప్రజలు ఆయా పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. అందుకే, ఏ పార్టీ అయినా తాము ఇచ్చిన హామీలను, చేపడతామన్న సంక్షేమ పథకాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చేలా చూస్తుంది.

అయితే, ఇప్పటివరకు ఏపీలో అధికారం చేపట్టిన పార్టీలన్నీ రకరకాల ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే, అన్ని సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ లభించినా….వాటిలో కొన్ని మాత్రమే బలంగా ప్రజల్లోకి వెళుతుంటాయి. అలా ప్రజల మనసుల్లో సెంటిమెంట్ గా నాటుకుపోయిన పథకాలే ఆయా పార్టీలకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలూ ఉన్నాయి.

ఇక, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కొన్నింటిని పక్కకు పెట్టిన ప్రభుత్వాలను జనం విస్మరించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ…అదే తరహాలో గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని విస్మరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ పథకాన్ని కంటిన్యూ చేయకుంటే….ప్రజల సెంటిమెంట్ దెబ్బతిని మిగతా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది కలిగే అవకాశముందని చెబుతున్నారు. టీడీపీ హయాంలో బాగా పాపులర్ అయిన అన్న క్యాంటీన్ల పై ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను వైసీపీ గుర్తించాలని అంటున్నారు.

ఏపీ ప్రజ‌ల మనసులను తాకిన పథకాలు చాలా అరుదు. అటువంటి ప‌థ‌కాల్లో రెండు రూపాయ‌ల‌కే కిలో బియ్యం పథకం ఒకటి. ప్రజలంతా అన్నగారి బియ్యం అంటూ పిలుచుకునే ఈ పథకం…నిజంగానే అన్నగారిని రెండోసారి అధికారంలోకి తీసుకువ‌చ్చింది. అదే తరహాలో 2004లో దివంగత నేత వైఎస్ రాజ‌శేఖర్‌‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కం జనాల్లో బాగా పాపులర్ అయింది.

ఆరోగ్యశ్రీ తో వైఎస్ ఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పక్క రాష్ట్రాలూ ఈ పథకాన్ని కాపీ కొట్టేలా ఈ పథకం జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఈ ప‌థ‌కంతోనే వైఎస్ రెండోసారి అధికారాన్ని చేపట్టారు. ఇక, అదే తరహాలో చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు జనానికి బాగానే కనెక్ట్ అయ్యాయి.

రూ.5కే టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్న భోజ‌నం, రూ.5కే రాత్రిపూట భోజ‌నం లేదా టిఫిన్ అందించే ఈ పథకం భారీగా సక్సెస్ అయింది. అయితే, జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లు తెరుచుకోలేదు.

కానీ, ప్రజ‌ల్లో ఈ ప‌థ‌కంపై సెంటిమెంట్ అలానే ఉంది. అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించాల‌ని 85 శాతం మంది ప్రజ‌లు కోరుతున్నార‌ని గ్రామ వలంటీర్ల సర్వేలోనూ తేలింది. దీంతో ఈ పథకం పున:ప్రారంభంపై వైసీపీ స‌ర్కారు మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఈ పథకం అమలు ప్రభావం పడవచ్చని బలంగా నమ్ముతోందట.

అయితే, అనూహ్యంగా జగన్ ఏడాది పాలనలో ఈ పథకం లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపించింది. ఇసుక కొరత వల్ల పనులు లేక ఇబ్బంది పడ్డ భవన నిర్మాణ కార్మికులు…ఆయా కూలీలకు ఈ పథకం లోటు బాగా తెలిసొచ్చింది. ఇపుడు, కరోనా సమయంలోనూ ఆ పథకం ఉంటే…చాలామంది అన్నార్తి తీరి ఉండేదని ప్రచార జరుగుతోంది.

జగన్ కు అనూహ్యంగా దెబ్బకొట్టిన ఏకైక పథకం ఇదేనని చెప్పవచ్చు. అందుకే, టీడీపీ….అన్న క్యాంటీన్ల వ్యవహారాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి లేవనెత్తుతూ ప్రజల్లో ఆ పథకంపై ఉన్న సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. మరి, సాధ్యమైనంత త్వరగా అన్న క్యాంటీన్లపై జగన్ ఫోకస్ చేస్తే….రాబోయే ఎన్నికల్లో ఆ మైలేజి తప్పక కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on July 28, 2020 11:34 am

Share
Show comments
Published by
suman

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

58 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

2 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago