Political News

నల్లారికే పీలేరు టికెట్

టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. యాత్రకు వచ్చిన జనాన్ని చూసి లోకేష్‌కు పట్టరాని ఆనందం కలుగుతోంది. యాత్ర 500 కిలోమీటర్ల మైలురాయి దగ్గర పడుతోంది. యాత్రలో భాగంగా రైతు, కర్షక, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను లోకేష్ పలుకరిస్తున్నారు. వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలం, ఏం చేస్తామో కూడా లోకేష్ చెప్పేస్తున్నారు.

అభ్యర్థుల ప్రకటన

యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను లోకేష్ ప్రకటిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు పోటీగా గాలి భానుప్రకాష్‌కు రంగంలోకి దించుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. 2019లో పలమనేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మళ్లీ అక్కడ పోటీ చేస్తారని లోకేష్ తేల్చేశారు. అమర్ నాథ్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వెంట నీడలా తిరుగుతూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో డాక్టర్ హెలెన్ ను అభ్యర్థిగా ప్రకటించారు. హెలెన్ కొత్త అభ్యర్థి కావడం గమనార్హం.

ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి నుంచి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రగిరి నుంచి పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారుజనసేనతో పొత్తు కుదిరితే తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లి స్థానాలను ఆ పార్టీకి వదిలేసే అవకాశం ఉంది.అందుకే అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు.

కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం

పీలేరు పాదయాత్రలో భాగంగా అక్కడ బహిరంగ సభ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని అందరూ సహకరించి ఆయన్ను గెలిపించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడే కిషోర్ కుమార్. వారి తండ్రి అమర్ నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు.

15వ సారి పోటీ

నల్లారి కుటుంబం ఎన్నికల్లో 15వ సారి పోటీ చేస్తోంది. కిషోర్ స్వయంగా మూడో సారి బరిలోకి దిగుతున్నారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి ఆరు సార్లు పోటీ చేశారు. అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఐదు సార్లు పోటీ చేశారు. ఒక సారి మాత్రమే ఓడిపోయారు. వారి తల్లి ఒకసారి ఎన్నికల బరిలో దిగారు.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

10 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

11 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

12 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

14 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

15 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

15 hours ago