వినటానికి విచిత్రంగా ఉన్నా ఇందులో పేద్ద లాజిక్ ఉంది. తెలంగాణా సాధన కోసమే కేసీయార్ ఏర్పాటుచేసిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని తాజా పరిణామాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కేసీయార్ చేసిన పనిపై రాష్ట్రంలోని జనాలతో పాటు ప్రతిపక్షాల్లో వ్యతిరేకత కనబడుతోంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ తెలంగాణాను గాలికొదిలేశారనే గోల పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఎవరో పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది.
ఇంతకీ పావులు ఎలా కదుపుతున్నారంటే టీఆర్ఎస్ పేరుతో కొత్తగా రాజకీయపార్టీ పెట్టేట్లుగా. టీఆర్ఎస్ అంటే మూడు పేర్లు వినబడుతున్నాయి. అవేమిటంటే తెలంగాణా రాజ్యసమితి, తెలంగాణా రైతుసమితి, తెలంగాణా రక్షణసమితి అని ప్రచారం జరుగుతోంది. పై మూడు పేర్లతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పై పేర్లతో ఎవరు దరఖాస్తులు చేసుకున్నారనే విషయం మాత్రం గోప్యంగానే ఉంది.
ఒకపుడు టీఆర్ఎస్ లో బాగా యాక్టివ్ గా ఉండి ఇపుడు అంటీ ముట్టనట్లున్నవారు, పార్టీలో నుండి బయటకు వచ్చేసిన నేతలే ఎవరో పై మూడుపేర్లతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నేతలున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏదేమైనా పై మూడు పేర్లలో దేన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదించినా బీఆర్ఎస్ కు చికాకులు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటివరకు పార్టీ గుర్తు కారును పోలిన ఇతర గుర్తులతోనే సమస్య ఎదురవుతోంది. అలాంటిది ఇపుడు పార్టీ పేరుతో చికాకులు కూడా ఎదుర్కోక తప్పేట్లులేదు. నిజానికి పార్టీపేరు టీఆర్ఎస్ అని పాపులైనట్లుగా బీఆర్ఎస్ అని ఇంకా పాపులర్ కాలేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ఊహించని రీతిలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ అనే పేరు బ్యాలెట్ లో కనబడితే జనాల్లో కన్ఫ్యూజన్ తప్పేట్లులేదు. దాంతో బీఆర్ఎస్ కు అదనపు నష్టం తప్పదనే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2023 4:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…