వినటానికి విచిత్రంగా ఉన్నా ఇందులో పేద్ద లాజిక్ ఉంది. తెలంగాణా సాధన కోసమే కేసీయార్ ఏర్పాటుచేసిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని తాజా పరిణామాల్లో జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే కేసీయార్ చేసిన పనిపై రాష్ట్రంలోని జనాలతో పాటు ప్రతిపక్షాల్లో వ్యతిరేకత కనబడుతోంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ తెలంగాణాను గాలికొదిలేశారనే గోల పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఎవరో పావులు కదుపుతున్నట్లు అనుమానంగా ఉంది.
ఇంతకీ పావులు ఎలా కదుపుతున్నారంటే టీఆర్ఎస్ పేరుతో కొత్తగా రాజకీయపార్టీ పెట్టేట్లుగా. టీఆర్ఎస్ అంటే మూడు పేర్లు వినబడుతున్నాయి. అవేమిటంటే తెలంగాణా రాజ్యసమితి, తెలంగాణా రైతుసమితి, తెలంగాణా రక్షణసమితి అని ప్రచారం జరుగుతోంది. పై మూడు పేర్లతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పై పేర్లతో ఎవరు దరఖాస్తులు చేసుకున్నారనే విషయం మాత్రం గోప్యంగానే ఉంది.
ఒకపుడు టీఆర్ఎస్ లో బాగా యాక్టివ్ గా ఉండి ఇపుడు అంటీ ముట్టనట్లున్నవారు, పార్టీలో నుండి బయటకు వచ్చేసిన నేతలే ఎవరో పై మూడుపేర్లతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల నేతలున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏదేమైనా పై మూడు పేర్లలో దేన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆమోదించినా బీఆర్ఎస్ కు చికాకులు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటివరకు పార్టీ గుర్తు కారును పోలిన ఇతర గుర్తులతోనే సమస్య ఎదురవుతోంది. అలాంటిది ఇపుడు పార్టీ పేరుతో చికాకులు కూడా ఎదుర్కోక తప్పేట్లులేదు. నిజానికి పార్టీపేరు టీఆర్ఎస్ అని పాపులైనట్లుగా బీఆర్ఎస్ అని ఇంకా పాపులర్ కాలేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ఊహించని రీతిలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ అనే పేరు బ్యాలెట్ లో కనబడితే జనాల్లో కన్ఫ్యూజన్ తప్పేట్లులేదు. దాంతో బీఆర్ఎస్ కు అదనపు నష్టం తప్పదనే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…