Political News

పెద్దిరెడ్డి సీఎం అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డికి సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య విభేదాలు సృష్టించటమే నారా లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నట్లున్నారు. అందుకనే పుంగనూరులో పాదయాత్రలో పెద్దిరెడ్డిని లోకేష్ గట్టిగా టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. జగన్ గనుక జైలుకు వెళితే తాను సీఎం అయిపోవాలని పెద్దిరెడ్డి వెయిట్ చేస్తున్నారట. జగన్ జైలుకు వెళతారని తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని లోకేష్ గుర్తుచేశారు.

మంత్రివర్గంలో కీలకంగా ఉండికూడా చిత్తూరు జిల్లాకు పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తంమీద జగన్ పాలనలో నష్టపోయిన జిల్లా ఏదన్నా ఉందంటే అది చిత్తూరు జిల్లా మాత్రమే అన్నారు. పెద్దిరెడ్డి కారణంగానే జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. మంత్రివర్గంలో, ప్రభుత్వంలో ఇంత కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి జిల్లాకు పరిశ్రమలను ఎందుకు సాధించలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అరాచకాల కారణంగానే పారిశ్రామికవేత్తలు భయపడి జిల్లావైపు చూడటంలేదని చెప్పారు.

తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే జిల్లాతో పాటు పుంగనూరును అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పుంగనూరు అభివృద్ధిని వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమల ఏర్పాటుతో పాటు జాబ్ కాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అగ్రకులాల్లోని పేదల అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా స్వయంఉపాధికి అవకాశమున్న మార్గాలను బాగా డెవలప్ చేస్తానని ప్రకటించారు.

అభివృద్ధి అంటే ఏమిటో పుంగనూరు రూపురేఖలను మార్చి తాను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇపుడు పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న పెద్దిరెడ్డి గ్యాంగును ఎట్టి పనిస్ధితుల్లోను వదిలేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. వచ్చేఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోతున్న చల్లా రామచంద్రారెడ్డి (బాబు)ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని పార్టీ శ్రేణులతో పాటు జనాలను కూడా లోకేష్ అభ్యర్ధించారు.

This post was last modified on March 5, 2023 4:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

45 minutes ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

2 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

2 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

3 hours ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

3 hours ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

5 hours ago