కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్ 14వరకు భారత్ అంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర సరిహద్దులను ఏపీ సర్కార్ మూసివేసింది.
అయితే, తెలంగాణలో హాస్టళ్లు మూసివేసినందున తాము స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చామని కొందరు ఏపీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు…పొందుగుల వద్ద ఏపీ సరిహద్దుకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి..14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తేనే అనుమతిస్తామని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలోనే పొందుగుల వద్ద పోలీసులపై రాళ్లదాడి కూడా జరిగింది. దీంతో, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా బాగున్నవారిని ఏపీలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను ఏపీలోని పలు సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో..హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్ లోనే పరిశీలించాలని ఏపీ పోలీసులకు ఆదేశించింది.
ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని, ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేనివారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని, ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ వేసిన పిటిషన్ ను విచారణ జరిపిన కోర్టు…పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…