వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లే అనిపిస్తోంది. విపక్షాల ఆరోపణలు, ఆయనపై అనుమానాల మధ్య సీబీఐ మూడో సారి ఆయన్ను ప్రశ్నించబోతోంది. జనవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన సీబీఐ మళ్లీ ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చింది. పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లి మరీ సీబీఐ అధికారులు నోటీసులు అందించి వచ్చారు. వరుసగా రెండు సార్లు ప్రశ్నించిన తర్వాత తలెత్తిన మరికొన్ని ప్రశ్నల ఆధారంగా అవినాష్ ను విచారించే అవకాశం ఉంది. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆరో తేదీన కడపలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు..
కోటలో గుస గుస
వివేకా హత్యకు తాడేపల్లి ప్యాలెస్ కు ఉన్న లింకులను తెలుసుకునేందుకు, అనుమానితులను బిగించేందుకు సీబీఐ ప్రయత్నిస్తూనే ఉంది. వివేకా హత్య రోజున అవినాష్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆ దిశగా వైఎస్ భారతి సహాయకుడు నవీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే ఒకసారి ప్రశ్నించింది. మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిజానికి నవీన్ కు నోటిసులు వెళ్లాయని చెబుతన్నారు. అయితే అటు సీఎం కార్యాలయం, ఇటు సీబీఐ మాత్రం ఆ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి.
సాక్షిగానా.. నిందితుడిగానా…
ఇంతవరకు అవినాష్ రెడ్డిని రెండు సార్లు పిలిచినప్పుడు 160 సీఆర్పీసీ కింద సాక్షిగా నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. ఇప్పుడు కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు సోమవారం తప్పకుండా హాజరు కావాలని నోటీసులిచ్చింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరిగింది. వివేకానంద రెడ్డి హత్యకు నలభై కోట్ల సుపారీ ఇచ్చిన పక్షంలో ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించబోతున్నారు….
This post was last modified on March 5, 2023 9:14 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…