Political News

రేవంత్ ఒంటరైపోయారా ?

తెలంగాణా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒంటరైపోయారు. పీసీసీ అధ్యక్షుడు ఒంటరైపోవటం బహుశా ఇదే మొదటిసారేమో. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన నేతలకు వ్యతిరేకంగా మరికొంతమంది నేతలుండేవారు. అయితే అధ్యక్షులకు కూడా బలమైన వర్గముండేది. కాబట్టి తన వ్యతిరేకులను పీసీసీ ప్రెసిడెంట్లు ధీటుగా ఎదుర్కోనేవారు. కానీ ఇపుడు రేవంత్ పరిస్ధితి గతానికి భిన్నంగా తయారైంది. ఏ విషయంలో కూడా సీనియర్లలో చాలామంది అధ్యక్షుడికి సహకరించటంలేదు.

తాజాగా జరిగిన ఎపిసోడే దీనికి ఉదాహరణ. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో సీనియర్ నేత మహేశ్వరరెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. ఒకవైపు రేవంత్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు మహేశ్వర్ పాదయాత్ర మొదలుపెట్టడం ఏమిటో అర్ధంకావటంలేదు. ఒకేసారి రేవంత్, మహేశ్వర్ పాదయాత్రలు చేస్తుండటంతో పార్టీ నేతల మధ్య అయోమయం పెరిగిపోతోంది. ఎవరి పాదయాత్రలో పాల్గొనాలో కొందరికి అర్ధంకావటంలేదు. పైగా భైంసాలో మొదలైన పాదయాత్రలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి అనేకమంది సీనియర్లు పాల్గొన్నారు.

సీనియర్ల ఆలోచన చూస్తుంటే రేవంత్ ను పార్టీలో ఒంటరిని చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. వీళ్ళెవరు కూడా రేవంత్ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు. రేవంత్ గాంధీభవన్ కు వస్తే వీళ్ళెవరూ కనబడరు. వీళ్ళలో ఎవరైనా పార్టీ ఆఫీసుకు వచ్చినపుడు రేవంత్ లోపల ఉన్నాడని తెలియగానే బయటనుండి బయటకే వెళిపోతారు. ఇదంతా చూస్తుంటే సీనియర్లలో చాలామంది కూడబల్లుకునే రేవంత్ ను దూరం పెడుతున్నట్లు అర్ధమైపోతోంది.

వీళ్ళంతా సరిపోరన్నట్లు మరో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత కంపుచేయాలో అంతా చేస్తున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే వాళ్ళకి ఎంపీ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇపుడే రేవంత్ పరిస్ధితి ఇలాగుంటే రేపు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఇంకెంత గొడవ అవుతుందో చెప్పక్కర్లేదు. చూస్తుంటే టికెట్ల కేటాయింపులో రేవంత్ కు ఎలాంటి పాత్రలేకుండా చేయాలనే ఆలోచన సీనియర్లలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. పరిస్దితి ఇలాగే ఉంటే చివరకు రేవంత్ ఒంటరిగానే మిగిలిపోవటం ఖాయమని అనిపిస్తోంది.

This post was last modified on March 5, 2023 3:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

17 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

29 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago