Political News

ప్రతిష్ట పెరుగుతుందనుకుంటే పరువు పోతోందే..

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన దగ్గర్నుంచి పారిశ్రామిక విధానం విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పరిశ్రమలను బెదరగొట్టి తరలిపోయేలా చేయడం.. చెప్పుకోదగ్గ కొత్త పరిశ్రమలు ఏవీ తీసుకురాకపోవడం పట్ల ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని సింపుల్‌గా వైసీపీ నేతలు ఈ విషయంలో దాటవేయడానికి కూడా వీల్లేకపోతోంది. కళ్ల ముందు ఏం జరుగుతోందో జనాలకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో నెగెటివిటీ తగ్గించేందుకు ఈ మధ్య ప్రయత్నాలు మొదలయ్యాయి. గత ఏడాది దావోస్ సమ్మిట్‌కు వెళ్లినపుడు జగన్ అండ్ కో కామెడీ అవ్వడం తప్ప పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఈసారి ఆ సమ్మిట్‌కు అసలు ప్రభుత్వం తరఫున ప్రతినిధులే వెళ్లలేదు. ఇదేంటని అడిగితే.. పారిశ్రామిక వేత్తలనే ఇక్కడికి రప్పిస్తాం అన్నారు.

ఈ క్రమంలోనే విశాఖలో గ్లోబల్ సమ్మిట్ అంటూ కొన్ని రోజుల నుంచి హడావుడి నడుస్తోంది.
తీరా వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌‌కు సమయం రానే వచ్చింది. మామూలుగా ఇలాంటి సమ్మిట్‌లు పూర్తయ్యాక అందులో జరిగిన ఒప్పందాలు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలు ప్రకటిస్తారు. కానీ సమ్మిట్ ఆరంభ సమయంలోనే సీఎం జగన్ ఘనంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటన చేసేశారు. ఇది అందరికీ విస్మయం కలిగించింది. మధ్యాహ్నానికల్లా పెట్టుబడుల వెల్లువ అంటూ మీడియాకు వివరాలు కూడా వెల్లడించేశారు. ఆ వివరాలు చూశాక సోషల్ మీడియా జనాలు రంగంలోకి దిగిపోయి జగన్ ప్రకటనల డొల్లతనం అంతా బయటపెట్టేశారు.

కనీసం వంద కోట్ల క్యాపిటల్ కూడా లేని సాయి అండ్ ఎలక్ట్రికల్స్ అనే సంస్థ 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం.. దశాబ్దాల వ్యవధిలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 20 వేల ఉద్యోగులను మాత్రమే కలిగి ఉన్న ఎన్టీపీసీ.. ఏపీలో 2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు, 77 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొనడం.. ఇలాంటి వివరాలన్నీ బయటికి తీసి జగన్ సర్కారును ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

పెట్టుబడుల గురించి కొంచెం ఎక్కువ చూపించుకోవచ్చు కానీ.. మరీ ఇలా నమ్మశక్యం కాని నంబర్లతో గారడీ చేయడం వల్ల జగన్ సర్కారుకు చెడ్డ పేరు రావడం తప్ప ఒరిగే ప్రయోజనం శూన్యం. ఓవైపు ఈ నంబర్ల వ్యవహారం కాస్తా కామెడీ అయిపోతే.. మరోవైపు ఈ సమ్మిట్లో డెలిగేట్స్‌కు ఇచ్చే కిట్ల దోపిడీ జరగడం.. భోజనాల దగ్గర నానా రభస జరగడం.. ప్రతినిధుల కోసం కేటాయించిన సీట్లలో ఐప్యాక్ బ్యాచ్‌ లాగా భావిస్తున్న వ్యక్తులు కూర్చుని హంగామా చేయడం.. లాంటి వ్యవహారాలతో జగన్ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతోంది.

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago