Political News

ఐప్యాక్ ప్రతినిధులే ఇన్వెస్టర్లా?

విశాఖ వేదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. అంబానీ, జీఎంఆర్, జిందాల్ వంటి దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరై జగన్ పరువు నిలబెట్టారు. అయితే… అదేసమయంలో ఇతర చిన్నాచితకా ఇన్వెస్టర్లుగా హాజరైనవారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐప్యాక్‌లో పనిచేసేవారిలో చాలామంది ఎంబీఏలు చేసినవారు, సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసినవారు ఉండడం… ఉత్తరాదికి చెందినవారు ఉండడంతో వారంతా ఇన్వెస్టర్లలా, ఔత్సాహికుల్లా ఈ సదస్సుకు వచ్చారని విపక్షాలు అంటున్నాయి.

సాధారణ ప్రజలు, మీడియా వారిని చూసి ఇన్వెస్టర్లు అనుకుని మోసపోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైసీపీ కార్యక్రమాలు, ఐప్యాక్ ఆఫీసులలో కనిపించిన కొందరు ఫొటోలు… ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాల్గొన్నవారి ఫొటోలతో పోల్చి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

రష్యాలో పుతిన్ కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కొందరు వ్యక్తులు, సొంత పార్టీకి చెందినవారు ఆయాపాత్రలలో కనిపిస్తుంటారని.. ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గానికి చెందినవారిలా నటిస్తూ పుతిన్‌తో ఆయన సొంత మనుషులే భేటీ అవుతుంటారని అంతర్జాతీయంగా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏపీలో జగన్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణే వస్తోంది. వైసీపీ రాజకీయ అవసరాలు, ఎన్నికల కోసం పనిచేసే ఐప్యాక్ ప్రతినిదులే ఈ ఇన్వెస్టర్ల సదస్సులోనూ కనిపించారని చెప్తున్నారు.

దేశమంతటికీ తెలిసిన కొందరు పారిశ్రామిక ప్రముఖులు తప్ప మిగతావారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులు.. దేశవిదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులేనని… వారు చేసుకున్న ఒప్పందాలన్నీ హంబక్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

29 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago