Political News

ఐప్యాక్ ప్రతినిధులే ఇన్వెస్టర్లా?

విశాఖ వేదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. అంబానీ, జీఎంఆర్, జిందాల్ వంటి దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరై జగన్ పరువు నిలబెట్టారు. అయితే… అదేసమయంలో ఇతర చిన్నాచితకా ఇన్వెస్టర్లుగా హాజరైనవారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐప్యాక్‌లో పనిచేసేవారిలో చాలామంది ఎంబీఏలు చేసినవారు, సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసినవారు ఉండడం… ఉత్తరాదికి చెందినవారు ఉండడంతో వారంతా ఇన్వెస్టర్లలా, ఔత్సాహికుల్లా ఈ సదస్సుకు వచ్చారని విపక్షాలు అంటున్నాయి.

సాధారణ ప్రజలు, మీడియా వారిని చూసి ఇన్వెస్టర్లు అనుకుని మోసపోతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైసీపీ కార్యక్రమాలు, ఐప్యాక్ ఆఫీసులలో కనిపించిన కొందరు ఫొటోలు… ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాల్గొన్నవారి ఫొటోలతో పోల్చి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

రష్యాలో పుతిన్ కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కొందరు వ్యక్తులు, సొంత పార్టీకి చెందినవారు ఆయాపాత్రలలో కనిపిస్తుంటారని.. ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గానికి చెందినవారిలా నటిస్తూ పుతిన్‌తో ఆయన సొంత మనుషులే భేటీ అవుతుంటారని అంతర్జాతీయంగా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏపీలో జగన్ విషయంలోనూ ఇలాంటి ఆరోపణే వస్తోంది. వైసీపీ రాజకీయ అవసరాలు, ఎన్నికల కోసం పనిచేసే ఐప్యాక్ ప్రతినిదులే ఈ ఇన్వెస్టర్ల సదస్సులోనూ కనిపించారని చెప్తున్నారు.

దేశమంతటికీ తెలిసిన కొందరు పారిశ్రామిక ప్రముఖులు తప్ప మిగతావారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులు.. దేశవిదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులేనని… వారు చేసుకున్న ఒప్పందాలన్నీ హంబక్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

This post was last modified on March 4, 2023 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

25 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago