Political News

ఏం జరిగింది : ప్రముఖులతో ప్రత్యేక విందుకు సీఎం జగన్ డుమ్మా

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేళలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సదస్సుల సందర్భంగా ఏర్పాటు చేసే విందునకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రత్యేక విందునకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం ఉదయం మొదలైన సదస్సుకు ఏపీ ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లే.. వ్యాపార దిగ్గజాల్ని తీసుకురావటంలో సఫలం కావటమే కాదు.. వారి చేత తాము ఏపీలో పెట్టే పెట్టుబడుల గురించి మాట చెప్పించటం ద్వారా.. పెట్టుబడిదారుల సదస్సును సూపర్ హిట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. ఒకరోజులోనే 13 లక్షల కోట్ల విలువైన వ్యాపార డీల్స్ ను ఏపీ ప్రభుత్వం చేసుకుందని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పటం తెలిసిందే.

అంచనాలకు మించి భారీగా వచ్చినట్లుగా పేర్కొన్న పెట్టుబడుల నేపథ్యంలో.. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక విందులోనూ ప్రముఖులు తళుక్కుమంటారని భావించారు. అనూహ్యంగా ఈ ప్రత్యేక విందునకు డుమ్మా కొట్టారు, ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాలేదు. తాను హోస్టు చేయాల్సిన విందుకు జగన్ రాకపోవటం ఏమిటన్న ఆరా పలువురి నుంచి వచ్చింది.

అయితే.. అసలు విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సదస్సుకు హాజరైన దిగ్గజ వ్యాపారులంతా సాయంత్రానికే విశాఖ నుంచి బయలుదేరి వెళ్లిపోవటంతో.. ప్రముఖులు ఎవరూ లేని పరిస్థితి. దీంతో.. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రత్యేక విందుకు రాకుండా డుమ్మా కొట్టినట్లుగా చెబుతున్నారు. ఒప్పందాలు అయినట్లుగా ప్రకటించిన తర్వాత ఎవరికి వారుగా ప్రముఖులంతా తిరుగుముఖం పట్టటంతో.. సదస్సు దగ్గర కోలాహలం కాస్త తగ్గిన పరిస్థితి. దీని ప్రభావం ప్రత్యేక విందు మీద కూడా పడిందని చెబుతున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయినంత మాత్రాన.. మిగిలిన వారితో కలిసి ప్రత్యేక విందునకు ముఖ్యమంత్రి జగన్ హాజరైతే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on March 4, 2023 10:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Vizag summit

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago