Political News

పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ‘ప‌ట్టెడ‌న్నం’ కోసం కొట్టుకున్నారా?

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల స‌ద‌స్సు శుక్ర‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఈ స‌ద‌స్సును ప్రారంభించారు. ఇక‌, ఈ స‌ద‌స్సుకు దేశ‌, విదేశాల నుంచి కూడా ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు వచ్చారు. అయితే.. ఈ స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌ప్ప‌టికీ.. క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా స‌మ్మిట్ కు వ‌చ్చిన వారికి ఇచ్చేందుకు కిట్‌లు ఇచ్చారు. అయితే.. వీటిని స‌రైన విధానంలో పంపిణీ చేయ‌క‌పోవ‌డంతో తోపులాట‌లు చోటు చేసుకున్నాయి.

అదేస‌మ‌యంలో స‌మ్మిట్ స‌క్సెస్ కోసం.. తోచిన వారికి.. అడిగిన వారికి కూడా పాస్‌లు ఇష్యూ చేశారు. దీంతో అస‌లు పెట్టుబడులు పెట్టేవారి కంటే.. చూసేందుకు వ‌చ్చిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా ఉచిత రిజిస్ట్రేష‌న్ అన‌గానే . తండోప‌తండాలుగా వ‌చ్చేశారు. దీంతో అంత‌ర్జాతీయ‌, జాతీయ ప్ర‌తినిధుల‌ను గుర్తించ‌డంలో పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, భోజ‌నాల స‌మ‌యానికి మ‌రింత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. కోట్ల రూపాయ‌లు(సుమారు 15 కోట్లు) ఖ‌ర్చు చేసిన ఈ స‌ద‌స్సుకు.. పెట్టుబ‌డులు ఎన్ని వ‌స్తాయో తెలియ‌దు. కానీ, వివాదాలు మాత్రం వ‌చ్చాయి.

పెట్టుబ‌డుల‌ సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరిగింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. నిజానికి గ‌తంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో విశాఖ‌లోనే పెట్టుబ‌డుల స‌ద‌స్సు పెట్టారు. కానీ, భోజ‌నాల కోసం తోపులాట‌లు చోటు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తీవ్ర వివాదంగా మారింది. ఎప్పుడైనా ఇన్వస్టర్స్ సమ్మిట్ పెట్టేటప్పుడు ఎవరు ఇన్వస్టర్లు, ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేదానిపై అధికారుల‌కు క్లారిటీగా ఉండాలి.

అయితే తాజా సమ్మిట్‌పై నీలిమేఘాలు క‌మ్ముకోవ‌డంతో స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసుకునేందుకు.. జనసంఖ్య భారీగా కనిపించాలని ప్ర‌భుత్వం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో భారీ సంఖ్య‌లో వ‌చ్చేశారు. ప‌లితంగా కిట్లు చాల‌లేదు. దీనికి తోడు భోజ‌న ఏర్పాట్ల‌లోనూ వీఐపీలు, వీవీఐపీల గ్యాల‌రీల్లోనూ సాధార‌ణ వ్య‌క్తులు దూసుకువ‌చ్చారు. దీంతో స‌మ్మిట్ తొలిరోజే వివాదాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌తినిధుల అవ‌మానాల‌కు.. అస‌హ‌నాల‌కు వేదిక అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 3, 2023 10:04 pm

Share

Recent Posts

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

33 minutes ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

5 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

6 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

6 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

9 hours ago