Political News

పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ‘ప‌ట్టెడ‌న్నం’ కోసం కొట్టుకున్నారా?

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల స‌ద‌స్సు శుక్ర‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఈ స‌ద‌స్సును ప్రారంభించారు. ఇక‌, ఈ స‌ద‌స్సుకు దేశ‌, విదేశాల నుంచి కూడా ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు వచ్చారు. అయితే.. ఈ స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌ప్ప‌టికీ.. క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా స‌మ్మిట్ కు వ‌చ్చిన వారికి ఇచ్చేందుకు కిట్‌లు ఇచ్చారు. అయితే.. వీటిని స‌రైన విధానంలో పంపిణీ చేయ‌క‌పోవ‌డంతో తోపులాట‌లు చోటు చేసుకున్నాయి.

అదేస‌మ‌యంలో స‌మ్మిట్ స‌క్సెస్ కోసం.. తోచిన వారికి.. అడిగిన వారికి కూడా పాస్‌లు ఇష్యూ చేశారు. దీంతో అస‌లు పెట్టుబడులు పెట్టేవారి కంటే.. చూసేందుకు వ‌చ్చిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా ఉచిత రిజిస్ట్రేష‌న్ అన‌గానే . తండోప‌తండాలుగా వ‌చ్చేశారు. దీంతో అంత‌ర్జాతీయ‌, జాతీయ ప్ర‌తినిధుల‌ను గుర్తించ‌డంలో పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, భోజ‌నాల స‌మ‌యానికి మ‌రింత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. కోట్ల రూపాయ‌లు(సుమారు 15 కోట్లు) ఖ‌ర్చు చేసిన ఈ స‌ద‌స్సుకు.. పెట్టుబ‌డులు ఎన్ని వ‌స్తాయో తెలియ‌దు. కానీ, వివాదాలు మాత్రం వ‌చ్చాయి.

పెట్టుబ‌డుల‌ సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరిగింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. నిజానికి గ‌తంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో విశాఖ‌లోనే పెట్టుబ‌డుల స‌ద‌స్సు పెట్టారు. కానీ, భోజ‌నాల కోసం తోపులాట‌లు చోటు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తీవ్ర వివాదంగా మారింది. ఎప్పుడైనా ఇన్వస్టర్స్ సమ్మిట్ పెట్టేటప్పుడు ఎవరు ఇన్వస్టర్లు, ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేదానిపై అధికారుల‌కు క్లారిటీగా ఉండాలి.

అయితే తాజా సమ్మిట్‌పై నీలిమేఘాలు క‌మ్ముకోవ‌డంతో స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసుకునేందుకు.. జనసంఖ్య భారీగా కనిపించాలని ప్ర‌భుత్వం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో భారీ సంఖ్య‌లో వ‌చ్చేశారు. ప‌లితంగా కిట్లు చాల‌లేదు. దీనికి తోడు భోజ‌న ఏర్పాట్ల‌లోనూ వీఐపీలు, వీవీఐపీల గ్యాల‌రీల్లోనూ సాధార‌ణ వ్య‌క్తులు దూసుకువ‌చ్చారు. దీంతో స‌మ్మిట్ తొలిరోజే వివాదాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌తినిధుల అవ‌మానాల‌కు.. అస‌హ‌నాల‌కు వేదిక అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 3, 2023 10:04 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

6 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

8 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

9 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

10 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

10 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

11 hours ago