Political News

పార్టీ మార‌తా.. ప‌ద‌వి ఇస్తారా?

ఆవిడ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క మ‌హిళా నాయ‌కురాలు. పైగా ఫైర్ బ్రాండ్‌. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్‌లో ఆమె చేసే కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మ‌హిళా నాయ‌కురాలు.. సుంక‌ర ప‌ద్మ‌శ్రీ. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. మ‌హిళ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయ‌కురాలు.

పైగా, రాజ‌ధాని అమ‌రావ‌తిని స‌మ‌ర్థిస్తున్న వారిలో ముందున్న నాయ‌కురాలు కూడా. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా అమ‌రావ‌తి గ‌ళం వినిపించారు. పార్టీలోనూ ఆమెకు తిరుగులేదు. అయితే, ఆమెను త‌మ వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త ఏడాదిన్న‌ర‌గా ఇరు ప‌క్షాల మ‌ధ్య పార్టీమార్పున‌కు సంబంధించి అనేక ర‌హ‌స్య చ‌ర్చ‌లుకూడా జ‌రిగాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అవి ఒక కొలిక్కి రాలేదు.

అంతేకాదు.. సాకే శైల‌జానాథ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఈ చ‌ర్చ‌ల విష‌యం తెలిసి.. ఆమె కు కొంత దూరం కూడా పెట్టారు. ఇక‌, ఆయ‌న‌పై ఫిర్యాదు చేసి.. ప‌ద‌విని వ‌దులుకునే వ‌ర‌కు పోరాడిన వారిలో సుంక‌ర కూడా ఉంటార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతుంటారు. సో.. ఇలా.. టీడీపీతో ట‌చ్‌లోకి వెళ్ల‌డం.. వెంట‌నే సైలెంట్ అయిపోవ‌డం.. ష‌రా మామూలుగా మారింది.

సుంక‌ర‌కు టికెట్ ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గన్న‌వ‌రం గెల‌చుకోవ‌చ్చ‌ని.. టీడీపీ నేత‌ల అంచ‌నా. ఇది కూడా నిజ‌మే కావొచ్చు. ఎందుకంటే.. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు ఈ చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆమె ప‌ద‌విని ఆశిస్తున్నారు. మంత్రి ప‌దవి ఇస్తాన‌ని హామీ ఇస్తే.. పార్టీ మారుతాన‌ని ష‌ర‌తు పెట్టిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీనికి చంద్ర‌బాబు సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 4, 2023 11:04 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

3 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

7 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

11 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

12 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago