ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక మహిళా నాయకురాలు. పైగా ఫైర్ బ్రాండ్. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్లో ఆమె చేసే కామెంట్లు రాజకీయంగా చర్చకు వస్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు.. సుంకర పద్మశ్రీ. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు.
పైగా, రాజధాని అమరావతిని సమర్థిస్తున్న వారిలో ముందున్న నాయకురాలు కూడా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అమరావతి గళం వినిపించారు. పార్టీలోనూ ఆమెకు తిరుగులేదు. అయితే, ఆమెను తమ వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాదిన్నరగా ఇరు పక్షాల మధ్య పార్టీమార్పునకు సంబంధించి అనేక రహస్య చర్చలుకూడా జరిగాయి. అయితే.. ఇప్పటి వరకు అవి ఒక కొలిక్కి రాలేదు.
అంతేకాదు.. సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న సమయంలో ఈ చర్చల విషయం తెలిసి.. ఆమె కు కొంత దూరం కూడా పెట్టారు. ఇక, ఆయనపై ఫిర్యాదు చేసి.. పదవిని వదులుకునే వరకు పోరాడిన వారిలో సుంకర కూడా ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. సో.. ఇలా.. టీడీపీతో టచ్లోకి వెళ్లడం.. వెంటనే సైలెంట్ అయిపోవడం.. షరా మామూలుగా మారింది.
సుంకరకు టికెట్ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం గెలచుకోవచ్చని.. టీడీపీ నేతల అంచనా. ఇది కూడా నిజమే కావొచ్చు. ఎందుకంటే.. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక, ఇప్పుడు ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. ఆమె పదవిని ఆశిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తే.. పార్టీ మారుతానని షరతు పెట్టినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి చంద్రబాబు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 4, 2023 11:04 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…