Political News

60 మంది వైసీపీ నేత‌లు జంపేనా?!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు. అంతేకాదు.. ఎప్పు డు ఎవ‌రు ఏపార్టీలోకి జంప్ చేస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి ప్ర‌జాస్వామ్యానిది. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెం డు ప‌ట్టాల‌పైనే నాయ‌కులు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. వైసీపీలో ఉన్న 150 (జ‌గ‌న్ మిన‌హా) మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేత‌లు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

ఇది నిజ‌మా? కాదా? అనేది ప‌క్క‌న పెడితే.. వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నిజం జ‌రిగేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వైసీపీలో ప‌రిస్థితి నివురు గ‌ప్పిన నిప్పులాగా ఉంది. ఎక్క‌డా కూడా నాయ‌కులు సంతోషంగా లేర‌నేది వాస్త‌వం. కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డం.. వారినే నెత్తిన పెట్టుకోవ‌డం.. ప్ర‌తిదానినీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ముడిపెట్టినామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌నే వాద‌న‌ ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గంతోపాటు.. కాపులు, కొన్ని జిల్లాల్లో క్ష‌త్రియులు కూడా సాయం చేశారు. అయితే.. వీరికి ప్రాధాన్యం విష‌యంలో స‌రైన న్యాయం జ‌రగ‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. “ఏదో ఊహించుకున్నాం. కానీ, ఏమీ జ‌ర‌గ‌డం లేదు” అని రెడ్డి వ‌ర్గం నాయ‌కులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

ఇక‌, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా విధులు, నిధులు కూడా లేకుండా చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల్లో తాము త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని వాపోతున్నారు. అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌పం చేసే సీఎం జ‌గ‌న్‌.. పార్టీ ప‌రంగా.. నాయ‌కుల ప‌రంగా కూడా అధికార కేంద్రీక‌ర‌ణే ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది మెజారిటీ ఎమ్మెల్యేల మాట‌గా వినిపిస్తోంది. దీంతో ఇలాంటి వారంతా కూడా పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on March 3, 2023 8:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

34 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago