ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ తొందర చూస్తే.. ఇది మరింత ఇబ్బందిగా మారడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. న్యాయవ్యవస్థ పరిశీలనలో ఉన్న విషయంపై జగన్ చాలా తొందరపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొందర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెలలో వచ్చే నూతన తెలుగు సంవత్సరాది నుంచి వాటిని లైన్లో పెట్టేయాలని జగన్ భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మూడు రాజధానులు, అమరావతి రాజధాని విషయంపై త్వరగా విచారణ చేయాలని ఆయన కోరుతున్నారు. ఇందులో రెండు ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి.. ఈ నెలలో 14 వ తేదీన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేరకు మూడు రాజధానులపై మరోసారి చట్టాలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే సుప్రీంలో ఏదో ఒకటి తేల్చేయాలని కోరుతోంది. ఇది అయితే.. వెంటనే ఒక చట్టం చేసేసి.. ఆ వెంటనే రాజధానిని తరలించేయాలని చూస్తున్నట్టు వైసీపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. రెండోది.. రాజధానులు కాకపోయినా.. సీఎం కార్యాలయం అయినా.. తరలించేయాలని చూస్తోంది. కానీ, ఈ రెండు అంశాలకు కూడా సుప్రీం కోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారనుంది.
అందుకే.. సుప్రీంకోర్టులో నిర్ణీత గడువు విధించినా(ఈ నెల 28న విచారిస్తామని) కాదు, ముందుగానే విచారించాలని.. పట్టుబడుతోంది. కానీ, ఇలా తొందర పడడం వల్ల మొత్తానికే మోసం వస్తుందని వైసీపీ నాయకులే చర్చించుకుంటుండడం గమనార్హం. ఎందుకంటే.. తొందర పడుతున్నారంటే.. దీనివెనుక ఏదో జరుగుతోందని.. సుప్రీంకోర్టు అభిప్రాయపడే అవకాశం ఉంటుందని.. ఇదే జరిగితే.. మరింత జాప్యం జరిగి.. ఎన్నికల సమయానికి కూడా ఏదీ తేలకపోవచ్చని అంటున్నారు వైసీపీ నేతలు. మరి జగన్ తన తొందరకు బ్రేకులు వేస్తారో లేదో చూడాలి.
This post was last modified on March 3, 2023 2:14 pm
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…