Political News

ఈ ‘తొంద‌ర’ కూడా ప్ర‌మాద‌మే జ‌గ‌న్ స‌ర్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సీఎం జ‌గ‌న్ తొంద‌ర చూస్తే.. ఇది మ‌రింత ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. న్యాయ‌వ్య‌వ‌స్థ ప‌రిశీల‌న‌లో ఉన్న విష‌యంపై జ‌గ‌న్ చాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొంద‌ర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెల‌లో వ‌చ్చే నూతన తెలుగు సంవ‌త్స‌రాది నుంచి వాటిని లైన్‌లో పెట్టేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మూడు రాజ‌ధానులు, అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంపై త్వ‌ర‌గా విచార‌ణ చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇందులో రెండు ఉద్దేశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. ఈ నెల‌లో 14 వ తేదీన రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేర‌కు మూడు రాజ‌ధానుల‌పై మ‌రోసారి చ‌ట్టాలు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంది.

అందుకే సుప్రీంలో ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని కోరుతోంది. ఇది అయితే.. వెంట‌నే ఒక చ‌ట్టం చేసేసి.. ఆ వెంట‌నే రాజ‌ధానిని త‌ర‌లించేయాల‌ని చూస్తున్న‌ట్టు వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. రెండోది.. రాజ‌ధానులు కాక‌పోయినా.. సీఎం కార్యాల‌యం అయినా.. త‌ర‌లించేయాల‌ని చూస్తోంది. కానీ, ఈ రెండు అంశాల‌కు కూడా సుప్రీం కోర్టు తీర్పు అత్యంత కీల‌కంగా మార‌నుంది.

అందుకే.. సుప్రీంకోర్టులో నిర్ణీత గ‌డువు విధించినా(ఈ నెల 28న విచారిస్తామ‌ని) కాదు, ముందుగానే విచారించాల‌ని.. ప‌ట్టుబ‌డుతోంది. కానీ, ఇలా తొంద‌ర ప‌డ‌డం వ‌ల్ల మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని వైసీపీ నాయ‌కులే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. తొంద‌ర ప‌డుతున్నారంటే.. దీనివెనుక ఏదో జ‌రుగుతోంద‌ని.. సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డే అవ‌కాశం ఉంటుందని.. ఇదే జ‌రిగితే.. మ‌రింత జాప్యం జ‌రిగి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి కూడా ఏదీ తేల‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి జ‌గ‌న్ త‌న తొంద‌ర‌కు బ్రేకులు వేస్తారో లేదో చూడాలి.

This post was last modified on March 3, 2023 2:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago