రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ధనిక రాష్ట్రమైంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు ఘనంగా చాటుకున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాష్ట్రం తమదే అని ఎన్నో వేదికలమీద ప్రకటించారు. అలాంటి ధనిక రాష్ట్రం ఇపుడు అప్పులు చేయందే గడిచేట్లుగా కనబడటంలేదు. ఇప్పటికే ఈ ఉపోద్ఘాతమంతా తెలంగాణా గురించే అని తెలిసిపోయుంటుంది. అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయార్ చెప్పుకున్న కాలం నుంచి అప్పులు చేయందే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్ధితికి ఎందుకు దిగజారిపోయిందో అర్థం కావట్లేదు.
ఇప్పటివరకు చేసిన అప్పులు తీర్చటానికి, వాటికి వడ్డీలు కట్టడానికి కూడా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు మార్చిలో ప్రభుత్వం సుమారు రు. 7 వేల కోట్లు కేటాయించాలని సమాచారం. ఈ మొత్తం చెల్లించకపోతే మళ్ళీ అప్పుకూడా పుట్టదు. అందుకనే ఆర్బీఐ దగ్గర అప్పుకోసం ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రెండో వారంలో కానీ ఇవ్వలేకపోతోంది.
అనుకున్నంత స్ధాయిలో రాబడి రాకపోవటం, ఆదాయాలు పెంచుకోలేకపోవటంతో పాటు వివిధ పథకాల్లో వ్యయం బాగా పెరిగిపోవటమే ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులైపోవటానికి కారణాలు. ఆర్ధిక పరిస్ధితిపై కేసీయార్ ఏవో మాటలు చెప్పి నెట్టుకొచ్చేస్తున్నారు కానీ పరిస్ధితంతా డొల్లే అని ప్రతిపక్షాల నేతలు ఇప్పటికే అనేకసార్లు విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నిలిచిపోతున్నాయి.
ఆర్ధిక సంవత్సరం ముగింపు కాబట్టి అన్నీ శాఖలు, పథకాలపైన దెబ్బ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆశించిన స్ధాయిలో ఆదాయం పెరగకపోవటం తో వేరే దారిలేక ఫిబ్రవరిలో బాండ్లను అమ్మి వెయ్యి కోట్ల రూపాయలను సమకూర్చుకున్నది. మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను అమ్మేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. ఇదంతా అప్పులకు కట్టాల్సిన వడ్డీల కోసమే అని ఆర్ధికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా తలకుమించిన పథకాలు ఎత్తుకోవటం వల్లే ఖజనాపై బాగా ఆర్ధికభారం పెరిగిపోతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరి ఎన్నికల సంవత్సరం కదా ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని బయటపడతాయో, వాటినుండి ప్రభుత్వం ఎలా బయటపడుతుందో చూడాల్సిందే.
This post was last modified on March 3, 2023 1:45 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…