సీనియర్ పొలిటీషియన్ రేణుకా చౌదరి. తాజాగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని అంశాల్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన మాటలు మంట పుట్టేలా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా గొప్ప పాలన చేసిన రాజశేఖర్ రెడ్డికి తన సంతానం కారణంగా సుఖం లేకుండా పోయిందని రేణుకా చౌదరి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ ఆత్మకు శాంతి లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. పిచ్చి వేషాలు వేస్తున్నారన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ విషయాలు బయటకు రాకుండా తండ్రిగా కాపాడినట్లుగా పేర్కొన్నారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్న ఆమె.. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఏపీ ప్రజల పరిస్థితి చూస్తే కోపం తెచ్చుకోవాలో.. జాలి పడాలో.. ఆక్రోషం తెచ్చుకోవాలో అర్థం కావట్లేదన్న ఆమె.. బంగారం లాంటి రాష్ట్రం పతనమైపోతుందన్నారు.
అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవటం ఏమిటన్నారు. నందమూరి తారక రామారావు కూడా రాజశేఖర్ రెడ్డిని గౌరవించేవారని.. వారిద్దరికి ఒకరిపై మరొకరికి గౌరవం ఉండేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చటం ద్వారా ఎన్టీఆర్ కే కాదు వైఎస్ ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేశారన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్ ముందు రాష్ట్రానికి ఒక వర్సిటీని తీసుకొచ్చి.. దానికి మీ తాత పేరో.. నీ పేరో పెట్టుకో’’ అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి రైతులకు ఎంత అడ్డుపడితే ఉద్యమం అంతగా బలపడుతుందన్నఆమె.. రాజధాని రైతులు పిలిస్తే తాను ఏ క్షణంలో అయినా వస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు.
This post was last modified on March 2, 2023 10:24 am
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…