Political News

సాకు దొరికింది.. రంగు పడింది..

విశాఖ పెట్టుబడుల సదస్సుకు రంగం సిద్ధమైంది. మార్చి 3,4 తేదీల్లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిలయన్, అంబానీ సంస్థల ప్రతినిధులుతో పాటు అమెరికా, ఐరోపా, ఆసియాలోని బడా కంపెనీల ప్రతినిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో ఎక్కువ మంది వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. విశాఖను రాజధానిగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కూడా ప్రచారం కోసం పెట్టుబడుల సదస్సును వాడుకుంటోంది.

రంగుల మయం

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని చోట్ల వైసీపీ రంగులు కనిపించాలని అనధికార ఆదేశాలు అందాయి. దానితో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు ప్రైవేటు భవనాలకు కూడా పార్టీ రంగులు వేసేశారు. కొన్ని సందర్భాల్లో అటువంటి ప్రయత్నాలు వివాదాస్పదమయ్యాయి.

పెట్టుబడుల సదస్సు జరుగుతున్న వేళ ఇప్పుడు విశాఖలో ఈ రంగుల పిచ్చి మరింత ముదిరి..నగరం అంతా ఇవే రంగులు దర్శనం ఇస్తున్నాయి. సదస్సుకు హాజరు కావడానికి ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ప్రయాణించే మార్గాలు, బసచేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాలతోపాటు వాటి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.దీని కోసం రూ. 125 కోట్లు కేటాయించారు. ఆ వంకతోనే అధికార వైసీపీ మెప్పుకోసం జీవీఎంసీ అధికారులు ఏకంగా విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌ల ఫ్రేమ్‌లను కూడా నీలం , తెలుపు రంగులతో నింపేశారు. వాటితో పాటు డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్క గోడలకు పార్టీ రంగులు వేయడానికే సుమారు రూ.20 కోట్లను వెచ్చిస్తున్నట్టు అధికారులే చెబుతున్నారు.

అసలు రూల్స్ ఏమిటో ?

సాధారణంగా జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు, భవనాల శాఖ మార్గదర్శకాల ప్రకారం రోడ్డుపై పసుపు, నలుపు రంగులను మాత్రమే వేయాలి. దీనివల్ల రాత్రివేళ వాహనదారులకు రోడ్డు మార్జిన్‌పై నిర్దిష్టమైన అంచనా ఉంటుంది. అయితే 3, 4 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సుతో పాటు నెలాఖరుకు నిర్వహించే జీ-20 సదస్సు కోసం నగరమంతా రంగులమయం చేస్తున్నారు.

జాతీయ రహదారితోపాటు నగరంలోని అంతర్గత రోడ్ల డివైడర్లు, సెంటర్‌ మీడియన్లకు వైసీపీ రంగులు వేయిస్తున్నారు.ఆఖరికి బీచ్‌రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా ఉన్న పోలీస్‌ అవుట్‌ పోస్టుకు ఏకంగా నీలం, తెలుపురంగు వేసేశారు. బస్ స్టాప్ కు కూడా వైసిపి కలర్స్ వేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రంగుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా అధికార పార్టీ తీరు మారలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి..

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

1 hour ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

3 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

3 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago