Political News

సాకు దొరికింది.. రంగు పడింది..

విశాఖ పెట్టుబడుల సదస్సుకు రంగం సిద్ధమైంది. మార్చి 3,4 తేదీల్లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రిలయన్, అంబానీ సంస్థల ప్రతినిధులుతో పాటు అమెరికా, ఐరోపా, ఆసియాలోని బడా కంపెనీల ప్రతినిధులను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అందులో ఎక్కువ మంది వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. విశాఖను రాజధానిగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కూడా ప్రచారం కోసం పెట్టుబడుల సదస్సును వాడుకుంటోంది.

రంగుల మయం

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని చోట్ల వైసీపీ రంగులు కనిపించాలని అనధికార ఆదేశాలు అందాయి. దానితో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు ప్రైవేటు భవనాలకు కూడా పార్టీ రంగులు వేసేశారు. కొన్ని సందర్భాల్లో అటువంటి ప్రయత్నాలు వివాదాస్పదమయ్యాయి.

పెట్టుబడుల సదస్సు జరుగుతున్న వేళ ఇప్పుడు విశాఖలో ఈ రంగుల పిచ్చి మరింత ముదిరి..నగరం అంతా ఇవే రంగులు దర్శనం ఇస్తున్నాయి. సదస్సుకు హాజరు కావడానికి ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ప్రయాణించే మార్గాలు, బసచేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాలతోపాటు వాటి పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.దీని కోసం రూ. 125 కోట్లు కేటాయించారు. ఆ వంకతోనే అధికార వైసీపీ మెప్పుకోసం జీవీఎంసీ అధికారులు ఏకంగా విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌ల ఫ్రేమ్‌లను కూడా నీలం , తెలుపు రంగులతో నింపేశారు. వాటితో పాటు డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్క గోడలకు పార్టీ రంగులు వేయడానికే సుమారు రూ.20 కోట్లను వెచ్చిస్తున్నట్టు అధికారులే చెబుతున్నారు.

అసలు రూల్స్ ఏమిటో ?

సాధారణంగా జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు, భవనాల శాఖ మార్గదర్శకాల ప్రకారం రోడ్డుపై పసుపు, నలుపు రంగులను మాత్రమే వేయాలి. దీనివల్ల రాత్రివేళ వాహనదారులకు రోడ్డు మార్జిన్‌పై నిర్దిష్టమైన అంచనా ఉంటుంది. అయితే 3, 4 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సుతో పాటు నెలాఖరుకు నిర్వహించే జీ-20 సదస్సు కోసం నగరమంతా రంగులమయం చేస్తున్నారు.

జాతీయ రహదారితోపాటు నగరంలోని అంతర్గత రోడ్ల డివైడర్లు, సెంటర్‌ మీడియన్లకు వైసీపీ రంగులు వేయిస్తున్నారు.ఆఖరికి బీచ్‌రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా ఉన్న పోలీస్‌ అవుట్‌ పోస్టుకు ఏకంగా నీలం, తెలుపురంగు వేసేశారు. బస్ స్టాప్ కు కూడా వైసిపి కలర్స్ వేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రంగుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా అధికార పార్టీ తీరు మారలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి..

This post was last modified on March 1, 2023 10:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago