ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనే సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా షార్ప్ షూటర్గా పేరున్న కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. జగన్ తొలి కేబినెట్లోనే బాలినేని మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక, రెండోసారి ఛాన్స్ దక్కక పోయే సరికి.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన చుట్టూనే కొన్ని సర్వేలు సాగుతున్నాయి.
స్థానికంగా కొందరు చేయించిన సర్వేల్లో బాలినేని పరిస్థితి ఏంటో తేలిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని అంటున్నారు. బాలినేని పరిస్థితి ఆశించినట్టుగా అయితే లేదని సొంత పార్టీలోనే నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బాలినేనికి ఇటీవల గడపగడపలోనూ కొంత చేదు అనుభవం కూడా ఎదురైంది.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు విషయాన్ని బాలినేని దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే.. ఆయన మౌనంగానే ఉంటున్నారు. పైగా.. ఇప్పుడే ఎందుకు? అని దాట వేస్తున్నారట కూడా. ఈ క్రమంలోనే లోకల్ ఛానెళ్లు కొన్ని.. ఇదే విషయంపై పరిశీలన చేసినప్పుడు .. బాలినేని హవా తగ్గినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంగోలు సిటీలో పరిస్థితి అటు ఇటుగా ఉందని అంటున్నారు. ఇక్కడ టీడీపీ హవా పుంజుకుందని.. చెబుతున్నారు.
అంటే.. 2014 సీన్ ఇక్కడ రిపీట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలోనూ టీడీపీ గాలి వీస్తోందని తాజాగా ఒక అంచనా. మరోవైపు.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండడం.. దీనిని మరింత పెంచుతుందనే అంచనాలు వస్తున్నాయి. అంటే.. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి నుంచి టీడీపీ కనుక ఒకింత కష్టపడితే.. బాలినేని హవా మరింత తగ్గుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 2, 2023 6:11 am
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…