ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనే సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా షార్ప్ షూటర్గా పేరున్న కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికలలో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. జగన్ తొలి కేబినెట్లోనే బాలినేని మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక, రెండోసారి ఛాన్స్ దక్కక పోయే సరికి.. తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన చుట్టూనే కొన్ని సర్వేలు సాగుతున్నాయి.
స్థానికంగా కొందరు చేయించిన సర్వేల్లో బాలినేని పరిస్థితి ఏంటో తేలిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని అంటున్నారు. బాలినేని పరిస్థితి ఆశించినట్టుగా అయితే లేదని సొంత పార్టీలోనే నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బాలినేనికి ఇటీవల గడపగడపలోనూ కొంత చేదు అనుభవం కూడా ఎదురైంది.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు విషయాన్ని బాలినేని దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే.. ఆయన మౌనంగానే ఉంటున్నారు. పైగా.. ఇప్పుడే ఎందుకు? అని దాట వేస్తున్నారట కూడా. ఈ క్రమంలోనే లోకల్ ఛానెళ్లు కొన్ని.. ఇదే విషయంపై పరిశీలన చేసినప్పుడు .. బాలినేని హవా తగ్గినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంగోలు సిటీలో పరిస్థితి అటు ఇటుగా ఉందని అంటున్నారు. ఇక్కడ టీడీపీ హవా పుంజుకుందని.. చెబుతున్నారు.
అంటే.. 2014 సీన్ ఇక్కడ రిపీట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలోనూ టీడీపీ గాలి వీస్తోందని తాజాగా ఒక అంచనా. మరోవైపు.. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండడం.. దీనిని మరింత పెంచుతుందనే అంచనాలు వస్తున్నాయి. అంటే.. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి నుంచి టీడీపీ కనుక ఒకింత కష్టపడితే.. బాలినేని హవా మరింత తగ్గుతుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 2, 2023 6:11 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…