ఏపీ సీఎం జగన్ అంటే.. వైసీపీ నాయకులు ఏం చెబుతారంటే.. ‘జననేత’ అని! అంతేకాదు.. ఆయన 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలోనూ “జననేత జగనన్నా.. జగనన్నా.. జననేత” అనే పాట ఠారెత్తిపోయింది. ఊరూవాడా.. ఈ పాటను వైసీపీ నాయకులు హోరెత్తించారు. మరి అలాంటి జననేత సభ పెడితే..జనాలుపోరిపోతున్నారు. పోనీ.. వీరిని కట్టడి చేద్దామని.. గేట్లకు తాళాలు వేసినా.. పోలీసులను పెట్టి బెదిరించినా.. గోడలు దూకి.. సందులు చూసుకుని మరీ పారిపోతున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో.. సీఎం జగన్ సభకు జనాన్ని భారీగా తరలించారు. వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని పలుగ్రామాల నుంచి డ్వాక్రా మహిళల్ని బస్సుల్లో తరలించారు. ఉదయం 9 గంటలకల్లా ప్రాంగణంలోకి.. పంపించేశారు. పదిన్నర గంటల తర్వాత జగన్ సభాస్థలికి చేరుకున్నారు. 11 గంటల తర్వాత వేదికపైకి చేరుకున్నారు. ఉదయం 9గంటల్లోపే గ్యాలరీల్లోకి ప్రవేశించిన ప్రజలకు ఈలోగా ఓపిక నశించింది.
ఓవైపు ఎండ, మరోవైపు ఆకలికి తట్టుకోలేక బయటిదారి పట్టారు. ఆంక్షల పేరుతో చుక్కలు చూపించిన పోలీసులు సభకు వచ్చినవారితో.. ఓ రకమైన సర్కస్ ఫీట్లే చేయించారు. సీఎం వెళ్లేదాకా బయటకు పంపేది లేదంటూ గేట్లు మూసేశారు. ఎండకు, ఆకలికి ఉండలేని ప్రజలు సీఎం ప్రసంగిస్తుండగానే.. గోడలు దూకి వెళ్లిపోయారు. గేటువరకూ వచ్చిన ప్రజలను పోలీసులు బయటకు వెళ్లనీయలేదు. గేటుకు తాళాలు వేశారు. సీఎం వెళ్లాకే గేట్లు తెరుస్తామని.. ఈలోగా వెళ్లాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్లాలని తెగేసి చెప్పారు.
గేటువద్ద ఎంతసేపు వేచిచూసినా ఎవరినీ బయటకు పంపలేదు. 40 ఏళ్లు దాటిన వారిపైనా దయ తలవలేదు. ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో.. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నతమ్ముళ్లు ఒకింత సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చింది. బారికేడ్ల లోపలి నుంచి దూరి బయటపడ్డారు. ప్రధాన గేటు తెరవకపోడంతో గోడ దూకారు. 40 నుంచి 50 ఏళ్ల వయస్కులు కూడా కష్టమైనా ఒకరినొకరు సాయం తీసుకుంటూ గోడ దూకారు. అలా ఒకరిద్దరు కాదు పెద్దసంఖ్యలో పరారయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే సభ కోసం వచ్చిన చాలా మంది ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇదీ.. ఇప్పుడు జననేత గ్రాఫ్!! అంటున్నారు నెటిజన్లు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…