ఔను! నిజమే… ఏపీలో బీజేపీ వికసించడం లేదు… మరింతగా విచ్ఛిన్నమవుతోంది. నిన్న మొన్నటి వరకు ఇంకేముంది.. అధికారంలోకి వచ్చేస్తాం.. పార్టీని అధికారంలోకి తెచ్చేస్తామని… చెప్పిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు మౌనంగా ఉండడం.. క్షేత్రస్థాయిలో పార్టీ విచ్చిన్నం కావడానికి దారులు వేసినట్టు అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
అసలు ఏం జరిగింది?
బీజేపీకి అంతో ఇంతో పట్టున్న ఏపీలో ఇప్పుడు పూర్తిగా కమలం రేకులు విడిపోయే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్ష విధానాలపై అసంతృప్త గళాలు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి నాయకులు తాజాగా తమకు ఉన్న పదవులను వదిలేసేందుకు సిద్ధమైపోయారు. నిజానికి పాతిక, ముప్పై ఏళ్లుగా వీరంతా కూడా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. అసలు ఏమీ రోజుల నుంచి అంతో ఇంతో పుంజుకునే పరిస్థితి వచ్చిందంటే వీరే కారణం.
ముఖ్యంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో పార్టీలోకి వచ్చిన వారు..తర్వాత.. అనేక మందిని పోగు చేసుకున్నారు. అయితే.. వీరిని కాదని, బీజేపీ సిద్ధాంతాలు కూడా తెలియని వారిని తీసుకొచ్చి వీర్రాజు అందలం ఎక్కిస్తుండటం పట్ల వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జిల్లాల అధ్యక్షుల మార్పుతో రాజీనామాలు, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసే పరిస్థితికి వచ్చారు.
అయినప్పటికీ.. వీరికి ఎలాంటి సానుకూల పరిణామాలు కూడా కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతానికి పార్టీ పదవులన్నీ వదిలేసి, కార్యక్రమాలకు దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ సేవలు పార్టీకి అవసరం లేదనే విధంగా రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటోందని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామంతో ఎన్నికలకు ముందు.. బీజేపీ మరింత ఏకాకి కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 28, 2023 11:20 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…