ఏపీలో పోలీసు వ్యవస్థపై అనేక విమర్శలువస్తున్నాయి. ఆ జిల్లా .. ఈ జిల్లా.. అనే తేడా లేదు. దాదాపు చా లా వరకు జిల్లాల్లో సీఐ స్థాయి పోలీసులు.. ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారనే కామెంట్లు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి వారంతా..రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇవే సందేహాలు వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రధానంగా నాలుగు జిల్లాల సీఐలు..రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని సీఐలు.. టీడీపీ నేతలపైనా..ఏకంగా చంద్రబాబు , నారా లోకేష్లపైనా.. దూకుడుగా వ్యవహరించి.. రాజకీయంగా విమర్శలు మోశారు. అయితే..దీనిపై మాజీ మంత్రి అమర్నాథ్ రియాక్ట్ అవుతూ.. వీరంతా కూడా ఉద్దేశ పూర్వకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పారు.
గత 2019 ఎన్నికలకు ముందు హిందూపురం సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ ఇలానే దూకుడుగా వ్యవహరించి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీ టికెట్ దక్కించుకున్నారని.. ఇప్పుడు ఈ సీఐలు కూడా ఇదే బాటలో ఉన్నారని.. ఆయన విమర్శించారు. అయితే.. ఇది అన్ని వేళలా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రేపు టీడీపీ ప్రభుత్వంవస్తే.. తిప్పేందుకు మీసం.. కొట్టేందుకు లాఠీ కూడా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హెచ్చరించారు. దీనిని బట్టి.. మరి ఖాకీలు మారతారో..లేక తమ పంథాను కొనసాగిస్తారో చూడాలి. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు.
This post was last modified on February 27, 2023 2:07 pm
వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…
కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల…
మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని…
రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఆయన…
ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి…