“వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి. పోటీ ఎంత ఉంటుంది.. ఎలా ఉంటుంది.. ఎవరెవరు చేతులు కలుపుతారు ..ఎవరెవరు ఎలా ముందుకు వస్తారు? అనేది అనవసరం. మనం మాత్రం గెలిచి తీరాలి. వైనాట్ 175”- ఇదీ తరచుగా సీఎం జగన్ తన పార్టీ నాయకులు..మంత్రులు.. మేధావులు.. ఇతర నాయకత్వానికి కూడా చెబుతున్నమాట. ఈ క్రమంలోనే వ్యూహాలపై వ్యూహాలు అల్లుతున్నారు. ఐడియాలపై ఐడియాలు వేస్తున్నారు.
వలంటీర్ వ్యవస్థ ద్వారా తనకు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులను ఇంటింటి బాటపట్టించారు. అసలు నియోజకవర్గం మొహం చూడని నాయకులను కూడా నియోజకవర్గం బాటపట్టించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
ఇక, గృహసారథులు అనే మరో కాన్సెప్టును తీసుకువస్తున్నారు. మార్చిలో ఉగాది రోజు నుంచి కూడా.. వీరు ఇంటింటికీ తిరుగుతారు. ప్రజలకు చేరువ అవుతారు. మరోవైపు.. సర్వేలపై సర్వేలు చేయిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ.. ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలు. ఇక, ఇప్పటి వరకు సీఎం జగన్ గడపగడప దాటలేదు.. అనే వారికి భారీ షాక్ ఇస్తూ.. ఇప్పుడు జగన్ బయటకు వస్తున్నారు.
అదే ‘పల్లెనిద్ర’. ఇప్పటి వరకు నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితమైన ఈ పల్లెనిద్రను ఇక నుంచి సీఎం జగన్ కూడా చేయనున్నారు. ఆయన ఆధ్వరంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిని కూడా ఉగాది తర్వాత నుంచి ప్రతి వారం మూడురోజుల పాటు ఖచ్చితంగా.. పల్లెల్లో నిద్రించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు.
తద్వారా ప్రజలకు చేరువ కావడంతోపాటు.. ఆయా గ్రామా ల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలే టార్గెట్గా జగన్తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమనే చెప్పాలి. మరి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
This post was last modified on February 27, 2023 1:52 pm
సాధారణంగా మనలో ఎక్కువమంది అనుకునేది ``డబ్బుదేముంది ముందు పని కానివ్వండి. భవిష్యత్తులో డబ్బు దానంతట అదే వస్తుంది.`` అని. ఇక,…
ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది ఇండస్ట్రీలో సంపాదించే డబ్బులను భూమి మీద పెట్టుబడిగా పెడుతుంటారు. ఇలా పాత కాలంలో పెట్టుబడులు పెట్టిన…
అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు.. తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు .. తాజాగా రెండు మునిసిపల్ చైర్మన్…
బెంగళూరు తర్వాత హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు…
ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తయితే, నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…