వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ.. మూడు అడు గులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించి రెండు నెలలు గడిచినా.. పట్టుమని 100 మంది కూడా చేరిన పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు సభ్యత్వం పుంజుకోలేదు? అనే విషయం ఆసక్తిగా మారింది.
జనసేన సభ్యత్వం పుంజుకోకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీ లకులు. 1) సభ్యత్వ రుసుము ఎక్కువగా ఉండడం. 2) పార్టీ నేతలు విస్తృతంగా సభ్యత్వం కోసం ప్రచారం చేయకపోవడం. 3) ప్రజల్లో ఆసక్తి లేకపోవడం. ఈ మూడు ప్రధాన కారణాలతోనే పార్టీ వెనుకబడి ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. సభ్యత్వ రుసుమును రూ.100-200గా నిర్ణయించాయి.
ఎవరు ఎంత కట్టినా.. చేర్చుకునేలా ఆదేశాలు ఉన్నాయి. కానీ, జనసేన సభ్యత్వం విషయానికి వస్తే మాత్రం రూ.500లుగా నిర్ణయించారు. ఇది చాలా పెద్ద మొత్తం కావడం గమనార్హం. అయితే.. జనసేన నేతలు చెబుతున్నది ఏంటంటే.. రూ.500ల సభ్యత్వంతో వ్యక్తిగత బీమా అందిస్తున్నామని చెబుతున్నా రు. కానీ, ఈబీమా టీడీపీ వైసీపీలు కూడా అందిస్తున్నాయి. దీంతో జనసేన సభ్యత్వం ముందుకు సాగడం లేదు.
ఇక, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అటు పవన్ చెప్పడం లేదు.. ఇటు క్షేత్రస్థాయి లో నాయకులు కూడా చొరవ చూపడం లేదు. దీంతో పార్టీలో చేరాలని ఆకాంక్ష ఉన్నవారు కూడా వెనుక బడి పోతున్నారు. మరోవైపు.. ప్రజల్లోనూ ఇప్పుడు ఆసక్తి లేకపోవడం గమనార్హం. ఇటీవల వరకు అంటే మూడు మాసాల కిందటి వరకు కూడా టీడీపీ, బీజేపీలు సభ్యత్వ నమోదును చేపట్టాయి. దీంతో ఇప్పుడు జనసేనలోచేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 27, 2023 6:27 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…