వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ.. మూడు అడు గులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించి రెండు నెలలు గడిచినా.. పట్టుమని 100 మంది కూడా చేరిన పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు సభ్యత్వం పుంజుకోలేదు? అనే విషయం ఆసక్తిగా మారింది.
జనసేన సభ్యత్వం పుంజుకోకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీ లకులు. 1) సభ్యత్వ రుసుము ఎక్కువగా ఉండడం. 2) పార్టీ నేతలు విస్తృతంగా సభ్యత్వం కోసం ప్రచారం చేయకపోవడం. 3) ప్రజల్లో ఆసక్తి లేకపోవడం. ఈ మూడు ప్రధాన కారణాలతోనే పార్టీ వెనుకబడి ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. సభ్యత్వ రుసుమును రూ.100-200గా నిర్ణయించాయి.
ఎవరు ఎంత కట్టినా.. చేర్చుకునేలా ఆదేశాలు ఉన్నాయి. కానీ, జనసేన సభ్యత్వం విషయానికి వస్తే మాత్రం రూ.500లుగా నిర్ణయించారు. ఇది చాలా పెద్ద మొత్తం కావడం గమనార్హం. అయితే.. జనసేన నేతలు చెబుతున్నది ఏంటంటే.. రూ.500ల సభ్యత్వంతో వ్యక్తిగత బీమా అందిస్తున్నామని చెబుతున్నా రు. కానీ, ఈబీమా టీడీపీ వైసీపీలు కూడా అందిస్తున్నాయి. దీంతో జనసేన సభ్యత్వం ముందుకు సాగడం లేదు.
ఇక, సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అటు పవన్ చెప్పడం లేదు.. ఇటు క్షేత్రస్థాయి లో నాయకులు కూడా చొరవ చూపడం లేదు. దీంతో పార్టీలో చేరాలని ఆకాంక్ష ఉన్నవారు కూడా వెనుక బడి పోతున్నారు. మరోవైపు.. ప్రజల్లోనూ ఇప్పుడు ఆసక్తి లేకపోవడం గమనార్హం. ఇటీవల వరకు అంటే మూడు మాసాల కిందటి వరకు కూడా టీడీపీ, బీజేపీలు సభ్యత్వ నమోదును చేపట్టాయి. దీంతో ఇప్పుడు జనసేనలోచేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 27, 2023 6:27 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…