రాజకీయాల్లో నేతలను నమ్మాలి. అది పార్టీ అధినేతల కర్తవ్యం కూడా. నాయకులను నమ్మితేనే కదా.. టికెట్లు ఇస్తారు. సో.. రాజకీయాల్లో నమ్మకం అనేది తప్పదు. అయితే.. ఈ నమ్మకం ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఇక్కడే ఇతర పార్టీలకు.. వైసీపీ అధినేతకు మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎవరిని ఎంత వరకు నమ్మాలో.. అంత వరకే నమ్ముతున్నారు జగన్. ఎక్కడా కూడా పూర్తిగా నాయకులకు పగ్గాలు ఇవ్వరు.
దీనిపై విమర్శలు ఉన్నాయి. జగన్ నాయకులకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని..కనీసం మాట్లాడనివ్వడం లేదని కూడా తరచుగా దుయ్యబడుతున్నారు. అయితే.. ఇలా ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీల పరిస్థితి ఏంటి? అనేది చూస్తే.. జగన్ చేస్తున్నది కరెక్టేనేమో.. అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీనే తీసుకుంటే..గన్నవరం నియోకవర్గంలో ఎమ్మెల్యే వంశీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. ఆయన ఇష్టానికి వదిలేసింది.
దీంతో పార్టీని బాగానే డెవలప్ చేసి.. దాని మాటున తాను కూడా డెవలప్ అయిపోయారు. వంశీ అంటే.. టీడీపీ పోయి.. వంశీ అంటే.. గన్నవరం.. గన్నవరం అంటే.. వంశీ అనేలా పరిస్థితి మారిపోయింది. ఇది.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడుఇక్కడ టీడీపీ అంటే.. వంశీనే అనుకునే పరిస్థితి రావడానికి కారణం.. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఫ్రీహ్యాండే. అదేవిధంగా గతంలో గుడివాడ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కన్నా నాయకులు బలం పుంజుకున్నారు.
ఇది పార్టీకి చేటు తెచ్చింది. ఫలితంగా పార్టీ కన్నా .. నాయకులు ఎదిగిపోయారు. వారు పార్టీని శాసించే పరిస్థితి వచ్చేసింది. దీనిని ముందుగానే గ్రహించిన జగన్.. ఎక్కడా కూడా నాయకులకు ఎంత వరకు ఫ్రీ ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. తప్ప. ఒక్క అంగుళం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకే.. గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా.. పార్టీని చూసి ఓటేసే పరిస్థితి ఉంది తప్ప.. నాయకులను చూసి ఓటే సే పరిస్థితి వైసీపీలో లేదు. ఇదీ.. జగన్ వ్యూహం.
This post was last modified on February 26, 2023 9:35 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…