రాజకీయాల్లో నేతలను నమ్మాలి. అది పార్టీ అధినేతల కర్తవ్యం కూడా. నాయకులను నమ్మితేనే కదా.. టికెట్లు ఇస్తారు. సో.. రాజకీయాల్లో నమ్మకం అనేది తప్పదు. అయితే.. ఈ నమ్మకం ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఇక్కడే ఇతర పార్టీలకు.. వైసీపీ అధినేతకు మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎవరిని ఎంత వరకు నమ్మాలో.. అంత వరకే నమ్ముతున్నారు జగన్. ఎక్కడా కూడా పూర్తిగా నాయకులకు పగ్గాలు ఇవ్వరు.
దీనిపై విమర్శలు ఉన్నాయి. జగన్ నాయకులకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని..కనీసం మాట్లాడనివ్వడం లేదని కూడా తరచుగా దుయ్యబడుతున్నారు. అయితే.. ఇలా ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీల పరిస్థితి ఏంటి? అనేది చూస్తే.. జగన్ చేస్తున్నది కరెక్టేనేమో.. అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీనే తీసుకుంటే..గన్నవరం నియోకవర్గంలో ఎమ్మెల్యే వంశీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. ఆయన ఇష్టానికి వదిలేసింది.
దీంతో పార్టీని బాగానే డెవలప్ చేసి.. దాని మాటున తాను కూడా డెవలప్ అయిపోయారు. వంశీ అంటే.. టీడీపీ పోయి.. వంశీ అంటే.. గన్నవరం.. గన్నవరం అంటే.. వంశీ అనేలా పరిస్థితి మారిపోయింది. ఇది.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడుఇక్కడ టీడీపీ అంటే.. వంశీనే అనుకునే పరిస్థితి రావడానికి కారణం.. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఫ్రీహ్యాండే. అదేవిధంగా గతంలో గుడివాడ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కన్నా నాయకులు బలం పుంజుకున్నారు.
ఇది పార్టీకి చేటు తెచ్చింది. ఫలితంగా పార్టీ కన్నా .. నాయకులు ఎదిగిపోయారు. వారు పార్టీని శాసించే పరిస్థితి వచ్చేసింది. దీనిని ముందుగానే గ్రహించిన జగన్.. ఎక్కడా కూడా నాయకులకు ఎంత వరకు ఫ్రీ ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. తప్ప. ఒక్క అంగుళం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకే.. గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా.. పార్టీని చూసి ఓటేసే పరిస్థితి ఉంది తప్ప.. నాయకులను చూసి ఓటే సే పరిస్థితి వైసీపీలో లేదు. ఇదీ.. జగన్ వ్యూహం.
This post was last modified on February 26, 2023 9:35 pm
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…