రాజకీయాల్లో నేతలను నమ్మాలి. అది పార్టీ అధినేతల కర్తవ్యం కూడా. నాయకులను నమ్మితేనే కదా.. టికెట్లు ఇస్తారు. సో.. రాజకీయాల్లో నమ్మకం అనేది తప్పదు. అయితే.. ఈ నమ్మకం ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఇక్కడే ఇతర పార్టీలకు.. వైసీపీ అధినేతకు మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎవరిని ఎంత వరకు నమ్మాలో.. అంత వరకే నమ్ముతున్నారు జగన్. ఎక్కడా కూడా పూర్తిగా నాయకులకు పగ్గాలు ఇవ్వరు.
దీనిపై విమర్శలు ఉన్నాయి. జగన్ నాయకులకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని..కనీసం మాట్లాడనివ్వడం లేదని కూడా తరచుగా దుయ్యబడుతున్నారు. అయితే.. ఇలా ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీల పరిస్థితి ఏంటి? అనేది చూస్తే.. జగన్ చేస్తున్నది కరెక్టేనేమో.. అనిపిస్తుంది. ఉదాహరణకు టీడీపీనే తీసుకుంటే..గన్నవరం నియోకవర్గంలో ఎమ్మెల్యే వంశీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. ఆయన ఇష్టానికి వదిలేసింది.
దీంతో పార్టీని బాగానే డెవలప్ చేసి.. దాని మాటున తాను కూడా డెవలప్ అయిపోయారు. వంశీ అంటే.. టీడీపీ పోయి.. వంశీ అంటే.. గన్నవరం.. గన్నవరం అంటే.. వంశీ అనేలా పరిస్థితి మారిపోయింది. ఇది.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇప్పుడుఇక్కడ టీడీపీ అంటే.. వంశీనే అనుకునే పరిస్థితి రావడానికి కారణం.. పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఫ్రీహ్యాండే. అదేవిధంగా గతంలో గుడివాడ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కన్నా నాయకులు బలం పుంజుకున్నారు.
ఇది పార్టీకి చేటు తెచ్చింది. ఫలితంగా పార్టీ కన్నా .. నాయకులు ఎదిగిపోయారు. వారు పార్టీని శాసించే పరిస్థితి వచ్చేసింది. దీనిని ముందుగానే గ్రహించిన జగన్.. ఎక్కడా కూడా నాయకులకు ఎంత వరకు ఫ్రీ ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. తప్ప. ఒక్క అంగుళం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకే.. గత ఎన్నికల్లోనూ.. ఇప్పుడు కూడా.. పార్టీని చూసి ఓటేసే పరిస్థితి ఉంది తప్ప.. నాయకులను చూసి ఓటే సే పరిస్థితి వైసీపీలో లేదు. ఇదీ.. జగన్ వ్యూహం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…