రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల కు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థు లు.. పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల తరఫున పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆయా స్థానిక సంస్థలకు చెందిన ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఓటు వేసి.. ప్రాధాన్యం కల్పిస్తారు.
ఇక, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పట్టభ ద్రులు.. ఓటేసి ఎన్నుకుంటారు. దీనికి సంబంధించి డిగ్రీ చదివిన వారు.. లేదా.. తత్సమానవైన అర్హత ఉన్నవారు.. కూడా ఎన్నికల కమిషన్ దగ్గర నమోదై.. ఓటు పొందుతారు. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రంలో ముగిసింది. ఈ పరంపరలో ప్రధాన పార్టీల నేతలను గమనిస్తే.. సీపీఐ, సీపీఎం నేతలు ముందు వరుసలో ఉన్నారు.
ఎక్కువగా ఓట్లు దక్కించుకుని(అర్హతతోనే) ముందు వరుసలో కామ్రేడ్లు నిలిచారు. ఇక, టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు అందరికీ.. గ్రాడ్యుయేట్ ఓటు హక్కు లభించింది. రేపు వినియోగించుకుంటారా లేదా? అనేది వారి ఇష్టం. ఇక, ఎటొచ్చీ.. ఇప్పుడు సీఎం జగన్ చుట్టూ.. రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయనకు ఇప్పటి వరకు సాధారణ ఓటు హక్కే తప్ప.. గ్రాడ్యుయేట్ ఓటు హక్కులేదు.
దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..చాలా మంది నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జగన్.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివానని చెబుతారు కానీ, తాను ఏం చదివిందీ మాత్రం వెల్లడించలేదు. ఎన్నికల అఫిడవిట్లోనూ తొలగించారు. ఇక, టీడీపీ నేత నారా లోకేష్ జగన్ను పదోతరగతి తప్పారంటూ.. ఇటీవల గేలి చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆయనకు గ్రాడ్యుయేట్ ఓటు హక్కులేకపోయేసరికి.. మరిన్ని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on February 26, 2023 2:28 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…