రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల కు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థు లు.. పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల తరఫున పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆయా స్థానిక సంస్థలకు చెందిన ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఓటు వేసి.. ప్రాధాన్యం కల్పిస్తారు.
ఇక, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ఉన్న పట్టభ ద్రులు.. ఓటేసి ఎన్నుకుంటారు. దీనికి సంబంధించి డిగ్రీ చదివిన వారు.. లేదా.. తత్సమానవైన అర్హత ఉన్నవారు.. కూడా ఎన్నికల కమిషన్ దగ్గర నమోదై.. ఓటు పొందుతారు. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రంలో ముగిసింది. ఈ పరంపరలో ప్రధాన పార్టీల నేతలను గమనిస్తే.. సీపీఐ, సీపీఎం నేతలు ముందు వరుసలో ఉన్నారు.
ఎక్కువగా ఓట్లు దక్కించుకుని(అర్హతతోనే) ముందు వరుసలో కామ్రేడ్లు నిలిచారు. ఇక, టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు అందరికీ.. గ్రాడ్యుయేట్ ఓటు హక్కు లభించింది. రేపు వినియోగించుకుంటారా లేదా? అనేది వారి ఇష్టం. ఇక, ఎటొచ్చీ.. ఇప్పుడు సీఎం జగన్ చుట్టూ.. రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయనకు ఇప్పటి వరకు సాధారణ ఓటు హక్కే తప్ప.. గ్రాడ్యుయేట్ ఓటు హక్కులేదు.
దీంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..చాలా మంది నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జగన్.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివానని చెబుతారు కానీ, తాను ఏం చదివిందీ మాత్రం వెల్లడించలేదు. ఎన్నికల అఫిడవిట్లోనూ తొలగించారు. ఇక, టీడీపీ నేత నారా లోకేష్ జగన్ను పదోతరగతి తప్పారంటూ.. ఇటీవల గేలి చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆయనకు గ్రాడ్యుయేట్ ఓటు హక్కులేకపోయేసరికి.. మరిన్ని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on February 26, 2023 2:28 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…