విశాఖ పట్నం టీడీపీలో నేతలకు పెద్ద పరీక్షే ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు సెమీఫైనల్ గా భావిస్తున్న మండలి అభ్యర్థుల ఎన్నిక.. టీడీపీకి నిజంగానే పరీక్షకానుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బలాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడంతోపాటు.. టీడీపీ పుంజుకుందనే సంకేతాలు పంపించాల్సిన అవసరం టీడీపీపై ఉంది.
ఈ నేపత్యంలోనే టీడీపీ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ము ఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికను టీడీపీ మరింత ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. టీడీపీ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవి రావు నిలబడ్డారు. ఈయన నామినేషన్ ఓకే కూడా అయింది. దీంతో ఇప్పుడు ఆయనను గెలిపించుకోవాలని.పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది.
మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ముఖ్యనాయకులు, శ్రేణులు కూడా వేపాడను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గండి బాబ్జీ, ఎంపీ అభ్యర్థి.. బాలయ్య చిన్నల్లుడు.. ఎం. శ్రీభరత్ వంటివారికి కూడా వేపాడ విజయం పరీక్షేనని చెప్పాలి. ఎన్నిక ముగిసే వరకు ప్రచార బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని చంద్రబాబు కూడా సూచనలు పంపారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు వైఫల్యం చెందాయనే సందేశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి పంపించనున్నారు. ముఖ్యంగా పట్టభద్రులైన నిరుద్యోగ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ గెలుపు ప్రభావం చూపుతుండడంతో వైసీపీ కూడా అదే తరహాలో ఇక్కడ ప్రచారం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 26, 2023 2:24 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…