విశాఖ పట్నం టీడీపీలో నేతలకు పెద్ద పరీక్షే ఎదురైంది. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు సెమీఫైనల్ గా భావిస్తున్న మండలి అభ్యర్థుల ఎన్నిక.. టీడీపీకి నిజంగానే పరీక్షకానుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బలాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడంతోపాటు.. టీడీపీ పుంజుకుందనే సంకేతాలు పంపించాల్సిన అవసరం టీడీపీపై ఉంది.
ఈ నేపత్యంలోనే టీడీపీ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ము ఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికను టీడీపీ మరింత ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. టీడీపీ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవి రావు నిలబడ్డారు. ఈయన నామినేషన్ ఓకే కూడా అయింది. దీంతో ఇప్పుడు ఆయనను గెలిపించుకోవాలని.పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది.
మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ముఖ్యనాయకులు, శ్రేణులు కూడా వేపాడను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గండి బాబ్జీ, ఎంపీ అభ్యర్థి.. బాలయ్య చిన్నల్లుడు.. ఎం. శ్రీభరత్ వంటివారికి కూడా వేపాడ విజయం పరీక్షేనని చెప్పాలి. ఎన్నిక ముగిసే వరకు ప్రచార బాధ్యతలను పక్కాగా నిర్వహించాలని చంద్రబాబు కూడా సూచనలు పంపారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు వైఫల్యం చెందాయనే సందేశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి పంపించనున్నారు. ముఖ్యంగా పట్టభద్రులైన నిరుద్యోగ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ గెలుపు ప్రభావం చూపుతుండడంతో వైసీపీ కూడా అదే తరహాలో ఇక్కడ ప్రచారం చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 26, 2023 2:24 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…