Political News

‘ఆంధ్రా మీడియా’ ఇప్పుడు పర్వాలేదా కేసీఆర్

పరిధితో సంబంధం లేకుండా పరిమితుల్ని పెట్టుకోవటం కొన్నిసార్లు చూస్తుంటాం. అదే సమయంలో పరిమితుల్ని తమ సౌలభ్యాలకు అనుగుణంగా మార్చుకునే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ గుణం కాస్త ఎక్కువ. తన రాజకీయ అవసరాల కోసం ఏ మాటనైనా మాట్లాడేస్తుంటారు. అప్పటివరకు ఆంధ్రోళ్లు రాక్షసులు.. పిశాచులు అనేసి.. అంతలోనే వారి కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాననే చతురత ఆయనకు మాత్రమే సొంతం. అవసరమైనప్పుడు కౌగిలించుకోవటం.. కాదనుకున్నప్పుడు తోసి పక్కకు పడేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

చంద్రబాబును బండ బూతులు తిట్టేసే కేసీఆర్.. అదే బాబుతో తనకు రాజకీయ ప్రయోజనం ఉందని భావించినప్పుడు ఆయన నోటి వచ్చిన మాటలు యూట్యూబ్ లో పాత వీడియోల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకంటే.. కాలానికి అనుగుణంగా తన వ్యూహాల్ని మార్చుకునే కేసీఆర్ కు ఇప్పుడు ఫోకస్ అంతా జాతీయరాజకీయాల మీద పడింది. అందులో భాగంగా తాను పేరు మార్చిన బీఆర్ఎస్ వేదిక మీద కొత్త తరహా రాజకీయాలకు తెర తీశారు.

వివిధ రాష్ట్రాల్లోని కొందరు అధినేతలను చేరదీసి వారికి తాను ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ.. తమ పార్టీని వేళ్లూరుకునేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోనూ బీఆర్ఎస్ శాఖను ఓపెన్ చేశారు. ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పేరుతో ఆయన ఎన్నేసి మాటలు అన్నది తెలిసిందే. తనకు నష్టం వాటిల్లేలా కథనం పబ్లిష్ అయిన వెంటనే సదరు మీడియా సంస్థలోని ‘ఆంధ్రా’ మూలాల్ని వెతికే ప్రయత్నం చేసి.. అదే అస్త్రాన్ని ఆయన సంధిస్తుంటారు.

మరి అంతలా ఆంధ్రా పేరుతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించే కేసీఆర్ కు ఇప్పుడు ఏపీ మీద ప్రేమ పొంగుకొచ్చింది. మాజీ సివిల్స్ అధికారితో పార్టీ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తన మీడియా సంస్థ అయిన నమస్తే తెలంగాణకు.. ఏపీకి తగ్గట్లు నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో దినపత్రికను తీసుకొస్తున్నారు. మరి.. ఇంతకాలం ఆంధ్రా అని నోరు పారేసుకున్న కేసీఆర్.. ఇప్పుడేం చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ఏ ఆంధ్రా ప్రాంతాన్ని.. ఏ ఆంధ్ రాప్రజల్ని తిట్టారో అదే ప్రజలకు తన పేపర్ ద్వారా రాజకీయాల్ని బోధించాలనుకునే కేసీఆర్ ప్లానింగ్ చూసినప్పుడు ఆయన గడుసు తనానికి కాస్తంత ఆశ్చర్యపోవాల్సిందే.

కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పేపర్ పెట్టటం ద్వారా తన పరిధుల్ని తానే తగ్గించుకుంటున్నారని చెప్పాలి. ఆయన మీడియా సంస్థ ఏమో కానీ.. తెలంగాణలో తన ప్రభుత్వ పని తీరును తప్పు పట్టే వారిని.. వేలెత్తి చూపించే వాళ్లను ఆంధ్రా మీడియా అంటూ ఫైర్ అయ్యే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నట్లేనని మాత్రం చెప్పక తప్పదు.

Satya

Recent Posts

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

14 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

1 hour ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

5 hours ago