వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబును బిజీ బిజీ చేయడమే వైసీ పీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి వదిలితే ఒకటి.. చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. నిజానికి చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23 నుంచి అంటే.. గురువారం నుంచి కూడా ఉత్తరాంధ్రలో పర్యటించాల్సి ఉంది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
అయితే.. అనూహ్యంగా తారకరత్న మరణంతో అక్కడకు వెళ్లారు. దీనికి ముందు తూర్పు గోదావరి జిల్లాలో ని మూడు నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ చేపట్టారు. ఇక్కడ కూడా మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయలేక పోయారు చంద్రబాబు. పోలీసులు అడ్డంకులు సృష్టించారని.. తమ సభలను అడ్డుకుంటున్నారని.. పేర్కొంటూ.. ఫోకస్ అంతా కూడా వాటిపైనే పెట్టేశారు. దీంతో చంద్రబాబు లక్ష్యం కొట్టుకుపోయింది.
నిజానికి ఆయా కార్యక్రమాలపై టీడీపీ నేతలు.. శ్రేణులుకూడా చాలానే ఆశలు పెట్టుకున్నాయి. చంద్రబా బు కూడా.. అంశాల వారీగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి.. వాటిలో డొల్లతనాన్ని బయట పెట్టి.. తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, విషయం మాత్రం యూటర్న్ తీసుకుంది. కేవలం పోలీసులు.. వారి దాడులపైనే మూడు రోజులు చంద్రబాబు దృష్టి పెట్టారు. ఫలితంగా అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అన్నట్టుగా మారిపోయింది.
ఇదిలావుంటే.. గురువారం నుంచి ప్రారంభించాల్సి ఉన్న మలివిడత.. ఇదేం ఖర్మ పూర్తిగా వాయిదా పడింది. గన్నవరం ఘటనతో చంద్రబాబు అక్కడ పర్యటనకు వెళ్లారు. పైగా.. ఇప్పుడు టీడీపీ నేతలను కాపాడు కోవాల్సిన.. వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబుకు వచ్చింది. మరోవైపు.. తీరిక లేని ప్రయాణాలు.. ప్రసంగాలతో చంద్రబాబు అలిసిపోయే పరిస్థితి ఉందనే చర్చ కూడా వస్తోంది. మొత్తంగా చూస్తే.. జగన్ వ్యూహంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుండడం గమనార్హం.
This post was last modified on February 25, 2023 2:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…