వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబును బిజీ బిజీ చేయడమే వైసీ పీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఒకటి వదిలితే ఒకటి.. చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. నిజానికి చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23 నుంచి అంటే.. గురువారం నుంచి కూడా ఉత్తరాంధ్రలో పర్యటించాల్సి ఉంది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
అయితే.. అనూహ్యంగా తారకరత్న మరణంతో అక్కడకు వెళ్లారు. దీనికి ముందు తూర్పు గోదావరి జిల్లాలో ని మూడు నియోజకవర్గాల్లో ఇదేం ఖర్మ చేపట్టారు. ఇక్కడ కూడా మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయలేక పోయారు చంద్రబాబు. పోలీసులు అడ్డంకులు సృష్టించారని.. తమ సభలను అడ్డుకుంటున్నారని.. పేర్కొంటూ.. ఫోకస్ అంతా కూడా వాటిపైనే పెట్టేశారు. దీంతో చంద్రబాబు లక్ష్యం కొట్టుకుపోయింది.
నిజానికి ఆయా కార్యక్రమాలపై టీడీపీ నేతలు.. శ్రేణులుకూడా చాలానే ఆశలు పెట్టుకున్నాయి. చంద్రబా బు కూడా.. అంశాల వారీగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి.. వాటిలో డొల్లతనాన్ని బయట పెట్టి.. తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, విషయం మాత్రం యూటర్న్ తీసుకుంది. కేవలం పోలీసులు.. వారి దాడులపైనే మూడు రోజులు చంద్రబాబు దృష్టి పెట్టారు. ఫలితంగా అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి అన్నట్టుగా మారిపోయింది.
ఇదిలావుంటే.. గురువారం నుంచి ప్రారంభించాల్సి ఉన్న మలివిడత.. ఇదేం ఖర్మ పూర్తిగా వాయిదా పడింది. గన్నవరం ఘటనతో చంద్రబాబు అక్కడ పర్యటనకు వెళ్లారు. పైగా.. ఇప్పుడు టీడీపీ నేతలను కాపాడు కోవాల్సిన.. వారికి అండగా నిలవాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబుకు వచ్చింది. మరోవైపు.. తీరిక లేని ప్రయాణాలు.. ప్రసంగాలతో చంద్రబాబు అలిసిపోయే పరిస్థితి ఉందనే చర్చ కూడా వస్తోంది. మొత్తంగా చూస్తే.. జగన్ వ్యూహంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుండడం గమనార్హం.
This post was last modified on February 25, 2023 2:48 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…