రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. మరో రెండు నెలల వరకు ఇలానే ఉంటాయా ? అప్పటికి ఉన్న పరిస్థి తులను గమనించి.. జనసేన దూకుడు పెంచుతుందా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వారాహి బస్సు ను రెడీ చేసినప్పటికీ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానిని ఇంకా రోడ్డెక్కించలేదు. ఆయన ఎప్పుడు వస్తారా ? ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారా ? అని పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఇప్పటికిప్పుడు వచ్చే ఉద్దేశం లేదని..జనసేన అంతర్గత చర్చల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. ముందుగానే పవన్ స్పందిస్తే.. ఎన్నికల నాటికి ఆయా అంశాలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో ఇప్పటి నుంచి యాత్ర చేసినా.. వచ్చే ఎన్నికల వరకు ఆ వేడి కొనసాగుతుందనే భావన కూడా లేదు.
అందుకే.. ఆచి తూచి ఖచ్చితంగా ఎన్నికలకు ఆరు మాసాలు లేదా 8 మాసాల ముందు పవన్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సినిమా షెడ్యూళ్లు కూడా ఇదే విధంగా ఉన్నట్టు జనసేన వర్గాల్లో చర్చసాగుతోంది. వచ్చే ఎన్నికలకు ముందు 8 మాసాలు ఫ్రీ అవుతారని.. అప్పుడు ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇలా వచ్చి పోవడం వల్ల కంటే.. పూర్తిగా కొన్ని నెలల పాటు ఏపీలోనే ఉంటే ఆప్రభావం ఎన్నికలపై ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చే రెండు మాసాల్లో పూర్తిగా పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేసి.. రంగంలోకి దిగితే.. అప్పుడు పార్టీపరంగా కూడా సైన్యం రెడీ అవుతుందని మరో అంచనా వేసుకుంటున్నారు. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. వచ్చే రెండు మూడు నెలల వరకు కూడా.. జనసేన దూకుడు పెద్దగా ఉండదని..తర్వాత.. ఆపడం కూడా కష్టమేనని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 25, 2023 12:27 pm
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్లలో సచిన్ ఒకరు. వేల కోట్ల ఆస్తి. ఇక అతనికి వారసుడిగా అర్జున్ హ్యాపీగా లైఫ్…