Political News

ఇక‌.. ఇప్పుడు చూడాలి ఏపీలో రాజ‌కీయం?!

వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల‌ను కూడా సొంత చేసుకోవాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావించారు. అందుకే త‌ర‌చుగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న హిత‌వు ప‌లుకుతున్నా రు. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని.. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఉందని భావించినా.. ఇప్పుడు ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు.

ఏపీలో రాజ‌కీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంత‌కాదు.. కీల‌క నాయ‌కుల‌ను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒడిసి ప‌ట్టు కుంటున్నారు. పాత విభేదాలు ప‌క్క‌న పెట్టి.. కొత్త పొత్తుల‌కు తెర‌దీస్తున్నారు. ప‌లితంగా అనూహ్య‌రీతిలో వైసీపీకి సెగ పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి ఎదురు లేద‌ని భావించిన వారు కూడా.. ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌నే అంచ‌నాల‌కు వ‌స్తున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో జ‌నసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత ప‌వ‌న్ త‌ర‌చుగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింప‌తీ ఓటు బ్యాంకు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డింది. మ‌రో రెండు సార్లు క‌నుక .. అక్క‌డ ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తే.. వైసీపీకి వ్య‌తిరేకత మ‌రింత పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, కీల‌క‌మైన నెల్లూరు రెడ్లు కూడా యూట‌ర్న్ తీసుకున్నార‌నే స‌మాచారం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది.

నెల్లూరు రెడ్లు ఆనం వ‌ర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిల‌క‌డైన రాజ‌కీయాలు చేసింద‌నే పేరుంది. టీడీపీతోనే ప్ర‌స్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ఉండ‌డంతో ఆనం వ‌ర్గానికి బ‌ల‌మైన రెడ్డి మ‌ద్ద‌తు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వ‌ర్గంలోనూ వైసీపీపై అస‌హ‌నం ఉండ‌డంతో .. ఈ వ‌ర్గం యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక‌, కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న క‌న్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజ‌కీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుంద‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు కూడా ఇక్క‌డ ప్ర‌భావం చూపిస్తున్నారు. వీరి ప్ర‌భావం కేవ‌లం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌మీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మ‌డి జిల్లాల‌పై రాజ‌ధాన‌ని ప్ర‌భావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జ‌రిగే రాజ‌కీయాలు రూటు వేరని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

ధరలు పెరుగుతుంటే ఇష్టమంటారా ట్రంప్

అమెరికాలో వస్తువుల ధరలు గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత వేగంగా పెరిగిపోతుండటంతో జనాల్లో విషయం చర్చనీయాంశంగా మారింది. గత…

36 minutes ago

బరువంతా అప్పలసూరి భుజాల మీదే

పెద్ది టాక్స్, డిస్కషన్ల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న మాట వాస్తవం. కొన్ని ఏరియాలలో పుష్ప…

1 hour ago

తనకు దక్కని రాజ్యసభ సీటు పై స్పందించిన షర్మిల

రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు…

2 hours ago

రవితేజకు అవసరం లేని రిస్క్ అది

రాజ రాజ చోర, స్వాగ్ దర్శకుడు హసిత్ గోలి, మాస్ మహారాజ రవితేజ కలయికలో ఒక సినిమా రూపొందబోయే సంగతి…

2 hours ago

టికెట్ల రేట్ల పంచాయితీ మళ్లీ మొదటికి

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం ఒక ఎడతెగని పంచాయితీగా మారుతోంది. నిర్మాతలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వానికి…

2 hours ago

విపరీతమైన ప్రేమ కాసులు కురిపిస్తుందా

వన్ సైడ్ లవ్ తెలుగు తెరకు కొత్త కాదు. కొన్ని వందల సార్లు చూసుంటాం. కాకపోతే చెప్పే విధానంలో దర్శకులు…

2 hours ago