వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కూడా సొంత చేసుకోవాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ భావించారు. అందుకే తరచుగా పార్టీ నాయకులకు ఆయన హితవు పలుకుతున్నా రు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తన చేతుల్లో ఏమీ లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్నటి వరకుఉందని భావించినా.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఏపీలో రాజకీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంతకాదు.. కీలక నాయకులను.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒడిసి పట్టు కుంటున్నారు. పాత విభేదాలు పక్కన పెట్టి.. కొత్త పొత్తులకు తెరదీస్తున్నారు. పలితంగా అనూహ్యరీతిలో వైసీపీకి సెగ పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీకి ఎదురు లేదని భావించిన వారు కూడా.. పరిస్థితులు అనుకూలంగా లేవనే అంచనాలకు వస్తున్నారు.
ఉత్తరాంధ్రలో జనసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత పవన్ తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింపతీ ఓటు బ్యాంకు.. తర్జన భర్జనలో పడింది. మరో రెండు సార్లు కనుక .. అక్కడ పవన్ పర్యటిస్తే.. వైసీపీకి వ్యతిరేకత మరింత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇక, కీలకమైన నెల్లూరు రెడ్లు కూడా యూటర్న్ తీసుకున్నారనే సమాచారం తరచుగా వినిపిస్తూనే ఉంది.
నెల్లూరు రెడ్లు ఆనం వర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిలకడైన రాజకీయాలు చేసిందనే పేరుంది. టీడీపీతోనే ప్రస్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉండడంతో ఆనం వర్గానికి బలమైన రెడ్డి మద్దతు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వర్గంలోనూ వైసీపీపై అసహనం ఉండడంతో .. ఈ వర్గం యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, కాపు సామాజిక వర్గంలో పేరున్న కన్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజకీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుందనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు.. అమరావతి రాజధాని రైతులు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నారు. వీరి ప్రభావం కేవలం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. సమీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మడి జిల్లాలపై రాజధానని ప్రభావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జరిగే రాజకీయాలు రూటు వేరని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 25, 2023 11:09 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…