Political News

ఇక‌.. ఇప్పుడు చూడాలి ఏపీలో రాజ‌కీయం?!

వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల‌ను కూడా సొంత చేసుకోవాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావించారు. అందుకే త‌ర‌చుగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న హిత‌వు ప‌లుకుతున్నా రు. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని.. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఉందని భావించినా.. ఇప్పుడు ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు.

ఏపీలో రాజ‌కీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంత‌కాదు.. కీల‌క నాయ‌కుల‌ను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒడిసి ప‌ట్టు కుంటున్నారు. పాత విభేదాలు ప‌క్క‌న పెట్టి.. కొత్త పొత్తుల‌కు తెర‌దీస్తున్నారు. ప‌లితంగా అనూహ్య‌రీతిలో వైసీపీకి సెగ పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి ఎదురు లేద‌ని భావించిన వారు కూడా.. ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌నే అంచ‌నాల‌కు వ‌స్తున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో జ‌నసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత ప‌వ‌న్ త‌ర‌చుగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింప‌తీ ఓటు బ్యాంకు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డింది. మ‌రో రెండు సార్లు క‌నుక .. అక్క‌డ ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తే.. వైసీపీకి వ్య‌తిరేకత మ‌రింత పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, కీల‌క‌మైన నెల్లూరు రెడ్లు కూడా యూట‌ర్న్ తీసుకున్నార‌నే స‌మాచారం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది.

నెల్లూరు రెడ్లు ఆనం వ‌ర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిల‌క‌డైన రాజ‌కీయాలు చేసింద‌నే పేరుంది. టీడీపీతోనే ప్ర‌స్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ఉండ‌డంతో ఆనం వ‌ర్గానికి బ‌ల‌మైన రెడ్డి మ‌ద్ద‌తు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వ‌ర్గంలోనూ వైసీపీపై అస‌హ‌నం ఉండ‌డంతో .. ఈ వ‌ర్గం యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక‌, కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న క‌న్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజ‌కీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుంద‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు కూడా ఇక్క‌డ ప్ర‌భావం చూపిస్తున్నారు. వీరి ప్ర‌భావం కేవ‌లం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌మీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మ‌డి జిల్లాల‌పై రాజ‌ధాన‌ని ప్ర‌భావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జ‌రిగే రాజ‌కీయాలు రూటు వేరని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 25, 2023 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

2 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

5 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

5 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

7 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

8 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

8 hours ago