Political News

ఇక‌.. ఇప్పుడు చూడాలి ఏపీలో రాజ‌కీయం?!

వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల‌ను కూడా సొంత చేసుకోవాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావించారు. అందుకే త‌ర‌చుగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న హిత‌వు ప‌లుకుతున్నా రు. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని.. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఉందని భావించినా.. ఇప్పుడు ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు.

ఏపీలో రాజ‌కీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంత‌కాదు.. కీల‌క నాయ‌కుల‌ను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒడిసి ప‌ట్టు కుంటున్నారు. పాత విభేదాలు ప‌క్క‌న పెట్టి.. కొత్త పొత్తుల‌కు తెర‌దీస్తున్నారు. ప‌లితంగా అనూహ్య‌రీతిలో వైసీపీకి సెగ పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి ఎదురు లేద‌ని భావించిన వారు కూడా.. ప‌రిస్థితులు అనుకూలంగా లేవ‌నే అంచ‌నాల‌కు వ‌స్తున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో జ‌నసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత ప‌వ‌న్ త‌ర‌చుగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింప‌తీ ఓటు బ్యాంకు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ప‌డింది. మ‌రో రెండు సార్లు క‌నుక .. అక్క‌డ ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తే.. వైసీపీకి వ్య‌తిరేకత మ‌రింత పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, కీల‌క‌మైన నెల్లూరు రెడ్లు కూడా యూట‌ర్న్ తీసుకున్నార‌నే స‌మాచారం త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది.

నెల్లూరు రెడ్లు ఆనం వ‌ర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిల‌క‌డైన రాజ‌కీయాలు చేసింద‌నే పేరుంది. టీడీపీతోనే ప్ర‌స్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాలం ఉండ‌డంతో ఆనం వ‌ర్గానికి బ‌ల‌మైన రెడ్డి మ‌ద్ద‌తు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వ‌ర్గంలోనూ వైసీపీపై అస‌హ‌నం ఉండ‌డంతో .. ఈ వ‌ర్గం యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక‌, కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న క‌న్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజ‌కీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుంద‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు కూడా ఇక్క‌డ ప్ర‌భావం చూపిస్తున్నారు. వీరి ప్ర‌భావం కేవ‌లం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. స‌మీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మ‌డి జిల్లాల‌పై రాజ‌ధాన‌ని ప్ర‌భావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జ‌రిగే రాజ‌కీయాలు రూటు వేరని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago