వైనాట్ 175– నినాదంలో రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కూడా సొంత చేసుకోవాలని.. వైసీపీ అధినేత, సీఎం జగన్ భావించారు. అందుకే తరచుగా పార్టీ నాయకులకు ఆయన హితవు పలుకుతున్నా రు. పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. తన చేతుల్లో ఏమీ లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే.. నిన్న మొన్నటి వరకుఉందని భావించినా.. ఇప్పుడు పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఏపీలో రాజకీయం చాలా అనూహ్యంగా మారిపోతోంది. మూడు ప్రాంతాల్లోనూ వైసీపీకి సెగ పుట్టించేలా రాజ కీయాలు వేడెక్కుతున్నాయి. అంతకాదు.. కీలక నాయకులను.. టీడీపీ అధినేత చంద్రబాబు ఒడిసి పట్టు కుంటున్నారు. పాత విభేదాలు పక్కన పెట్టి.. కొత్త పొత్తులకు తెరదీస్తున్నారు. పలితంగా అనూహ్యరీతిలో వైసీపీకి సెగ పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వైసీపీకి ఎదురు లేదని భావించిన వారు కూడా.. పరిస్థితులు అనుకూలంగా లేవనే అంచనాలకు వస్తున్నారు.
ఉత్తరాంధ్రలో జనసేన దూకుడు పెంచింది. పార్టీ అధినేత పవన్ తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో వైసీపీకి ఉన్న సింపతీ ఓటు బ్యాంకు.. తర్జన భర్జనలో పడింది. మరో రెండు సార్లు కనుక .. అక్కడ పవన్ పర్యటిస్తే.. వైసీపీకి వ్యతిరేకత మరింత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇక, కీలకమైన నెల్లూరు రెడ్లు కూడా యూటర్న్ తీసుకున్నారనే సమాచారం తరచుగా వినిపిస్తూనే ఉంది.
నెల్లూరు రెడ్లు ఆనం వర్గంగా ఉంటారు. ఎందుకంటే.. ఆనం కుటుంబం నిలకడైన రాజకీయాలు చేసిందనే పేరుంది. టీడీపీతోనే ప్రస్థానం ప్రారంభించినా.. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉండడంతో ఆనం వర్గానికి బలమైన రెడ్డి మద్దతు ఉంది. ఇప్పుడు ఆనం టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి వర్గంలోనూ వైసీపీపై అసహనం ఉండడంతో .. ఈ వర్గం యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, కాపు సామాజిక వర్గంలో పేరున్న కన్నా తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుంటూరు రాజకీయాల్లో వైసీపీకి పెను కుదుపు చోటు చేసుకుందనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు.. అమరావతి రాజధాని రైతులు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నారు. వీరి ప్రభావం కేవలం ఒక్క గుంటూరుతోనే ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. సమీపంలోని నాలుగు నుంచి ఐదు ఉమ్మడి జిల్లాలపై రాజధానని ప్రభావం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు ఉన్న వేడి వేరు.. ఇక నుంచి జరిగే రాజకీయాలు రూటు వేరని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 25, 2023 11:09 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…