Political News

కేసీఆర్ డిఫెన్సులో పడేలా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

రాజకీయ ప్రత్యర్థులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు మంత్రాల మాదిరిగా మారటమే కాదు.. అప్పటివరకు ఉన్న ఆలోచనల్ని మర్చేలా చేస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని వార్డుల్లోకి వర్షపు నీరుతో పాటు.. మురుగు నీరు చేరటం.. సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ వైనంతో కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారింది.

ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరిన వైనంపై సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియోలన్ని కేసీఆర్ మీద వ్యతిరేకతను పెంచేలా చేస్తే.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఆ ప్రభావాన్ని సగానికి పైనే తగ్గించేసింది. అంతలా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు.. తాను ఉస్మానియాను కూల్చేసి.. కొత్త భవనాన్ని కడతానంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.

తన తప్పేమీ లేదని.. ఉస్మానియాలో వర్షపు నీరు పాపమంతా ప్రతిపక్షాలదేనని ఆయన మండిపడ్డారు. దీంతో.. అప్పటివరకు కేసీఆర్ ను వేలెత్తి చూపినోళ్లు.. నిజమేనా? అన్న సందేహానికి గురయ్యారు.

ఇలాంటివేళ.. తాము అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి ఉస్మానియాను సందర్శించిన ఆయన.. వర్షం కారణంగా ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు ఎందుకు వచ్చాయో తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు కొత్త భవనాలు కడతామంటే తాము అడ్డు చెప్పలేదని.. కాకుంటే ఇప్పుడున్న చోట కాకుండా కొత్త చోట ఉస్మానియా ఆసుపత్రుల్ని నిర్మించాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలకు చేపట్టాల్సిన రిపేర్ల కోసం టీఆర్ఎస్ సర్కారు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. చారిత్రక భవనాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

నిజాం హయాంలో అద్భుతమైన భవనాల్ని నిర్మించారని.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సర్కారు మాత్రం రూపాయి ఖర్చు చేయలేదన్నారు. నిజాం నిర్మించిన భవనాల్ని కూల్చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. చారిత్రక భవనాల్నిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని.. ఖాళీగా ఉన్న ఆరు ఎకరాల్లో కొత్త భవనాల్ని నిర్మించాలని కోరారు.

సచివాలయం కోసం కొత్త భవనాల్ని నిర్మిస్తూ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారని.. కరోనా వ్యాప్తిలో కేసీఆర్ సర్కారు ఫెయిల్ అయ్యిందన్నారు. ఇప్పటివరకూ కొత్త భవనాలకు విపక్షాలే అడ్డు అని చెప్పిన కేసీఆర్ తాజాగా ఉత్తమ్ చేసిన విస్పష్టమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికర అంశం. మరి.. దీనికి కేసీఆర్ సారు ఎలాంటి మేజిక్ చేస్తారో?

This post was last modified on July 26, 2020 9:25 pm

Share

Recent Posts

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

8 minutes ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

6 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

9 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

11 hours ago