వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన ఏకంగా 175 కు 175 సీట్లలోనూ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే… ఈ ఫార్ములా ను సొంతం చేసుకోవడం.. అంటే 175 సీట్లలోనూ విజయం దక్కించుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.
అందుకే.. జగన్ వ్యూహాలపై వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను సంపూర్ణంగా వాడుకున్నారు. వీరి ద్వారా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతున్నా తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఇప్పటికే.. తన పార్టీ నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రులను గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక, సొంత సర్వేల ద్వారా.. ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి వద్దు అనేది కూడా తేల్చేస్తున్నారు.
అంటే ఒకరకంగా.. వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే.. మరోవైపు.. పథకాలు అమలు చేస్తూనే.. ఇంకోవైపు.. నలుమూలల నుంచి కూడా వ్యూహాత్మకంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫలితంగా..వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకునే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఈ క్రమంలోనే గృహ సారథులు అనే కాన్సెప్టు కూడా త్వరలోనే పట్టా లెక్కనుంది.
అయితే.. వీటిని గమనిస్తున్న టీడీపీ నేతలకు.. సందేహాలు ముసురుకున్నాయి. మనకు ఇన్ని వ్యూహాలు లేవు.. ఇప్పుడు ఏం చేయాలని వారు ఆలోచన చేస్తున్నారు. అయితే..ఇటీవల చంద్రబాబు జగన్ తెచ్చిన గృహ సారథుల కాన్సెప్టుకు సమానంగా.. ఇంచార్జ్ సారథులు.. అనే కొత్త పేరుతో ఆయన వ్యవస్థను ఏర్పా టు చేశారు. ఇంతకుమించిన వ్యూహం అయితే.. కనిపించడం లేదు. దీంతో జగన్ వ్యూహాలకు చంద్రబాబు చాలా దూరంగా ఉన్నారనే భావన టీడీపీలో వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on February 24, 2023 1:15 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…