వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన ఏకంగా 175 కు 175 సీట్లలోనూ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగుతున్నారు. అయితే… ఈ ఫార్ములా ను సొంతం చేసుకోవడం.. అంటే 175 సీట్లలోనూ విజయం దక్కించుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.
అందుకే.. జగన్ వ్యూహాలపై వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థను సంపూర్ణంగా వాడుకున్నారు. వీరి ద్వారా ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతున్నా తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఇప్పటికే.. తన పార్టీ నాయకులు. ఎమ్మెల్యేలు, మంత్రులను గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక, సొంత సర్వేల ద్వారా.. ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరికి వద్దు అనేది కూడా తేల్చేస్తున్నారు.
అంటే ఒకరకంగా.. వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే.. మరోవైపు.. పథకాలు అమలు చేస్తూనే.. ఇంకోవైపు.. నలుమూలల నుంచి కూడా వ్యూహాత్మకంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫలితంగా..వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకునే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఈ క్రమంలోనే గృహ సారథులు అనే కాన్సెప్టు కూడా త్వరలోనే పట్టా లెక్కనుంది.
అయితే.. వీటిని గమనిస్తున్న టీడీపీ నేతలకు.. సందేహాలు ముసురుకున్నాయి. మనకు ఇన్ని వ్యూహాలు లేవు.. ఇప్పుడు ఏం చేయాలని వారు ఆలోచన చేస్తున్నారు. అయితే..ఇటీవల చంద్రబాబు జగన్ తెచ్చిన గృహ సారథుల కాన్సెప్టుకు సమానంగా.. ఇంచార్జ్ సారథులు.. అనే కొత్త పేరుతో ఆయన వ్యవస్థను ఏర్పా టు చేశారు. ఇంతకుమించిన వ్యూహం అయితే.. కనిపించడం లేదు. దీంతో జగన్ వ్యూహాలకు చంద్రబాబు చాలా దూరంగా ఉన్నారనే భావన టీడీపీలో వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on February 24, 2023 1:15 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…