ఏపీ బీజేపీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబిక్కింది. పార్టీ మాజీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీలో చేరిన రోజే కొందరు రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్లి ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఫిర్యాదు చేశారు. జమ్ముల శ్యామ్ కిషోర్, చిగురుపాటి కుమారస్వామి, తుమ్మల అంజిబాబు, ధారా సాంబయ్య, బాలకోటేశ్వరరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, శ్రీమన్నారాయణ, సుబ్బయ్య, చిలుకుపాటి కుమారస్వామి, హనుమంతు ఉదయ్ భాస్కర్ సహా పలు జిల్లాల మాజీ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు తో సహా 30 మంది నేతలు ఢిలీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అయిన కేంద్ర మంత్రి మురళీధరన్ను కలిసి తమ వాదనను వినిపించారు.
విచిత్ర వాదన
మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర నేతలు విచిత్రంగా మాట్లాడారు. సోము వీర్రాజును మార్చకపోయినా ఫర్యాలేదని ఆయన వైఖరి మారితే చాలునని, అందరినీ గౌరవించాలని కోరినట్లు చెప్పారు. ఇంతదూరం ఎందుకొచ్చారు.. నేను రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడుకునే వాళ్లం కదా అని మురళీధరన్ వారితో అన్నారట. నాయకత్వ మార్పు తన చేతుల్లో లేదని తేల్చేసిన మురళీధరన్.. తొందరపడ వద్దని సున్నితంగా రాష్ట్ర నేతలను హెచ్చరించారు.
టీడీపీతో పొత్తు వద్దని చెప్పాం..
మాటలో మాటగా టీడీపీతో పొత్తు వద్దని తామె చెప్పినట్లు రాష్ట్ర నేతలు ప్రకటించారు. నిజానికి అదంతా అధిష్టానం డైరక్షన్ అని తెలుస్తోంది. మురళీధరనే ఆ సంగతి ప్రస్తావించి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయని అడిగారట. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో తెలీదు కానీ.. టీడీపీతో పొత్తు వద్దని చెప్పేశారట. చెప్పీ చెప్పకుండా మీడియా ముందు ఈ సంగతి వదలాలని రాష్ట్ర నేతలను మురళీధరన్ ఆదేశించారట. దానితో బయటకు వచ్చిన ఆ నేతలు అదే మాటను ఉన్నది ఉన్నట్లనుగా చెప్పేసి.. చల్లగా జారుకున్నారు. మరి అది బీజేపీ అఫిషియల్ స్టాండా లేక.. అలా వదిలి రియాక్షన్ చూస్తున్నారా తెలియాల్సి ఉంది. దీనిపై టీడీపీ ప్రతిస్పందన ఏమిటో చూడాలి…..
This post was last modified on February 24, 2023 1:05 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…