కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ బాట పట్టారు. అయితే.. గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాయపాటి సాంబశివరావు.. నాలుగు రోజుల కిందట.. కన్నా లాంటివారు వచ్చినా.. తనకు ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రావడమే.. తమముందున్న కర్తవ్యమని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
కానీ, రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఏమో.. వెంటనే రాయపాటి యూటర్న్ తీసుకున్నారు. కన్నా గతంలో చంద్రబాబును దూషించారని.. తనను కోర్టుకు లాగి పరువునష్టం కేసు వేశారని.. అలాంటి వ్యక్తితో కలిసి తాను ప్రయాణం చేయలేనని చెప్పుకొచ్చారు. మరి ఇంతలోనే ఆయన ఎలా మారిపోయారనేది ప్రధాన ప్రశ్న. దీనికి కారణం.. అధికార పార్టీ నేతలు ఉన్నారని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలకుముందు నుంచి కూడా రాయపాటిపై వైసీపీ నేతల కన్ను పడింది. అప్పట్లో నరసారావుపేట ఎంపీ టికెట్ను రాయపాటి మరోసారి ఆశించారు. అయితే.. ఆయన వృద్ధుడు అయిపోవడంతో పార్టీ నాయకులు వద్దని చెప్పారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఎన్నికల నామినేషన్ డేట్ దగ్గరకు వస్తోంది. దీంతో ఒక్కసారిగా రాయపాటి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
నాకన్నా.. బలమైన.. గెలిచే అభ్యర్థి ఉంటే టికెట్ ఇచ్చుకోమనండి.. అని కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ అనుకూల మీడియాలో ఇంకేముంది.. రాయపాటి టీడీపీకి రాజీనామా చేస్తున్నారని ప్రచారం చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన చంద్రబాబు గెలిస్తే.. గెలుస్తాం.. ఓడితే ఓడుతాం.. అంటూ.. టికెట్ను ఆయనకే ఇచ్చారు. తీరా.. రాయపాటి ఓడిపోయారు. ఇక.. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్న రాయపాటి.. మళ్లీ ఎన్నికలకు ముందు.. హల్చల్ చేస్తున్నారు. అది కూడా కన్నా విషయంలో ఇలా యూటర్న్ తీసుకోవడం చూస్తే.. వైసీపీ ఉద్దేశ పూర్వకంగా ఏదో చేయిస్తోందని టీడీపీ నేతలు అనుమానిస్తుండడం గమనార్హం.
This post was last modified on February 23, 2023 3:15 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…