Political News

జగన్ సస్పెండ్ చేస్తే… కేంద్రం పెద్ద పోస్ట్ ఇచ్చింది

ఓవైపు ఏపీలో అధికార వైసీపీ, బీజేపీ రాష్ట్ర నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో కేంద్రంలో ప‌రిపాలిస్తున్న బీజేపీ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి షాక్‌కు గుర‌య్యే నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ సార‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలిగించి కేసు నమోదు చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు కేంద్రంలో పదోన్నతి క‌ట్ట‌బెట్టింది. త‌ద్వారా జ‌గ‌న్ స‌ర్కారు తొల‌గించిన అధికారికి కీల‌క ప‌ద‌వి ఇచ్చింది.

జాస్తి కృష్ణ కిశోర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేశారు. అయితే వైసీపీ ర‌థ‌సార‌థి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం ప‌రిణామాలు మారాయియ. కృష్ణకిశోర్ అవినీతికి పాల్పడ్డార‌ని పేర్కొంటూ జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.

కృష్ణకిషోర్‌పై కేసులు నమోదు చేసింది. అయితే దీనిపై కృష్ణ కిశోర్ సైతం ఈ విష‌యాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని క్యాట్‌ను ఆశ్రయించారు. అనంత‌రం సస్పెన్షన్‌పై క్యాట్ స్టే విధించింది. దాంతో ఆయన రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్రానికి రిపోర్ట్ చేశారు.

కృష్ణ కిశోర్ ఆరోప‌ణ‌ల విష‌యంలో అడ్డంకులు తొల‌గిన నేప‌థ్యంలో కృష్ణ ఆయ‌న‌‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రధాన కార్యాయలయంలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కీల‌క స‌మ‌యంలో ఇటు జ‌గ‌న్ సర్కారుకు షాక్ త‌గిలిన‌‌ట్ల‌యిందని అంటున్నారు.

This post was last modified on April 23, 2020 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago