మ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న వివాదం.. అనంతరం టీడీపీ నేతల అరెస్టులు వంటి ఘటనలతో స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇమేజ్ డ్యామేజీ అయిందా ? అంటే.. ఔననే అంటున్నాయి.. వైసీపీ వర్గాలు. వైసీపీలోనే వంశీ అంటే గిట్టని వర్గం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు.. వర్గం తాజాగా జరిగిన గన్నవరం ఎపిసోడ్ ద్వారా వంశీ పని అయిపోయిందనే ప్రచారం ప్రారంభించినట్టు చెబుతున్నారు.
నిజానికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వంశీ వైసీపీ టికెట్పై పోటీ చేసి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో అసలు టీడీపీనే లేదని ప్రచారం చేసేందుకు వంశీ ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే ఏదొ ఒక వంక పెట్టుకుని టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారని.. యార్లగడ్డ వర్గం ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కేవలం సోషల్ మీడియాకు పరిమితం అయ్యాయి.
వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ.. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో నేరుగా తనకు టికెట్ అడిగితే ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అవకాశం కోసం.. ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందివచ్చిన అవకాశాన్నిఆయన సద్విని యోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వైసీపీలోనే గుసగుస వినిపిస్తోంది.
ప్రస్తుతం అక్కడ ఏం జరిగిందన్న విషయాలను మీడియాకు అందుతున్న క్రమాన్ని పరిశీలిస్తే.. యార్లగడ్డ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంశీ ఇమేజ్ డ్యామేజీ అయిపోయిందని.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో వంశీ అనుచరులు చిచ్చు పెడుతున్నారని.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తుండడం గమనార్హం. ప్రజల్లోనూ ఇది సహించే పరిస్థితి లేదని వీరు అంటుండడం గమనార్హం. మొత్తానికి టీడీపీని ఏదో చేయాలని అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వంశీకి వైసీపీలోనే సెగ పుడుతుండడం గమనార్హం.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…