Political News

31 మంది ఎంపీలు.. ఒక్కటంటే ఒక్క అవార్డు కొట్ట‌లేక పోయారే!

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు 9 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు. అంటే.. మొత్తంగా 31 మంది ఎంపీలు ఉన్నారు. అయితే.. వీరిలో ఎంత మంది ఆయా చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్తున్నారు? ఎంత‌మంది.. ఉత్త‌మ ఎంపీలుగా ప‌నిచేస్తున్నారు? ఎంత మంది ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నిస్తున్నారు? అంటే.. జీరో అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజాగా పార్ల‌మెంటు స‌చివాల‌యం.. ఉత్త‌మ ఎంపీల‌కు సంస‌ద్ ర‌త్న‌ అవార్డులు ప్ర‌క‌టించింది.

అయితే.. అవార్డుల్లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా వైసీపీ ఎంపీలు అవార్డులు తెచ్చుకోలేక పోయారు. చిన్న చిన్న‌రాష్ట్రాల‌కు చెందిన వారు ఈ జాబితాలో ఉండ‌డాన్ని చూస్తే.. ఏపీ వంటి రాష్ట్రంలో ఎందుకు ఈ కొర‌త ఏర్ప‌డింద‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి తాజాగా పార్ల‌మెంటు ప్ర‌క‌టించిన జాబితాలో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి, రాజ్యసభ సభ్యులు మనోజ్‌ ఝా(ఆర్‌జేడీ-బిహార్‌), జాన్‌ బ్రిటాస్‌ (సీపీఎం) సహా 13 మంది ఎంపీలు ‘సంసద్‌ రత్న (2023)’ అవార్డుకు ఎంపికయ్యారు.

సంద‌స్ ర‌త్న అవార్డుకు ఎంపికైన వారిలో 8 మంది.. బిద్యుత్‌ బరన్‌ మహతో(జార్ఖండ్‌-ఏపీ క‌న్నా చిన్న రాష్ట్రం), సుకాంత మజుందార్‌(బెంగాల్‌), హీనా విజయకుమార్‌ గవిట్‌, గోపాల్‌ చిన్నయ్య శెట్టి (మహారాష్ట్ర), సుదీర్‌ గుప్తా (మధ్యప్రదేశ్‌)-బీజేపీ.. కుల్‌దీప్‌రాయ్‌ శర్మ (అండమాన్‌) కాంగ్రెస్‌.. అమోల్‌ రామ్‌సింగ్‌ కొల్హే-ఎన్‌సీపీ.. లోక్‌సభకు చెందినవారు ఉన్నారు.

ఐదుగురు సభ్యులు.. బ్రిటాస్‌, ఝా, ఫౌజియా తహసీన్‌ అహ్మద్‌ ఖాన్‌ (ఎన్‌సీపీ), విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ (ఎస్‌పీ), ఛాయా వర్మ (కాంగ్రెస్‌) రాజ్యసభకు చెందినవారు ఉన్నారు. భారత రాజకీయాలకు, ప్రజలకు విశేష సేవలు అందించిన సీనియర్‌ నేతలను గౌరవించేందుకు ‘ది ఫౌండేషన్‌ అండ్‌ ప్రీసెన్స్‌’ గత ఏడాది డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును నెలకొల్పింది. ఈ అవార్డుకు సీపీఎం మాజీ రాజ్యసభ సభ్యుడు టీకే రంగరాజన్‌ను జ్యూరీ ఎంపిక చేసింది. మార్చి 25న ఢిల్లీలో ఈ అవార్డులను అందజేస్తారు.

పార్లమెంటులో అద్భుత పనితీరు కనబరచిన పార్లమెంటేరియన్లను గౌరవించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఇచ్చిన సలహాతో ‘ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌’ 2010లో ‘సంసద్‌ రత్న’ అవార్డును నెలకొల్పింది.

Satya

Recent Posts

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

25 minutes ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

41 minutes ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

52 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

1 hour ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

2 hours ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

3 hours ago