Political News

కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?

ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్‌కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు కాపులు బలంగా ఉన్నవేనని.. అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తే కోటగిరికి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ వెలమ కులానికి చెందినవారు. ఏలూరు ఎంపీ సీటు పరిధిలో కాపు ఓటర్లే అధికంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వైసీసీ గాలి వీయడం.. క్రాస్ ఓటింగ్ జరగకపోవడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. కానీ రానున్న ఎన్నికల్లో పరిస్థితి అలా ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఏలూరు పార్లమెంటు స్థానానికి కాకుండా నూజివీడు అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటున్నారట.

ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఉంగటూరు, దెందులూరు, ఏలూరు, కైకలూరులలో కాపు జనాభా అధికం. పోలవరం, చింతలపూడిలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ఇక మిగిలిని నూజివీడు నియోజకవర్గంలో మాత్రం వెలమల సంఖ్య ఎక్కువ. దీంతో నూజివీడు అసెంబ్లీ నియోజవకర్గంలో పోటీ చేయడానికి శ్రీధర్ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఎంపీగా నియోజకవర్గంలో పాల్గొంటున్న కార్యక్రమాలు కూడా ఎక్కువగా నూజివీడులోనే ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

పార్టీ అధిష్టానం దగ్గర కూడా శ్రీధర్ ఇప్పటికే తన ఆలోచన చెప్పారని, కానీ, ఇంకా ఆమోద ముద్ర రాలేదని తెలుస్తోంది. అయితే… వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణలు కీలకం కావడంతో కోటగిరి ప్లానుకు అధిష్ఠానం ఓకే చెప్పొచ్చని భావిస్తున్నారు. అయితే… నూజివీడు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావును కాదని కోటగిరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

This post was last modified on February 21, 2023 8:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago