గన్నవరంలో కాలిపోయింది.. టీడీపీ వాహనాలు. గన్నవరంలో దాడికి గురైంది టీడీపీ కార్యాలయం. గన్నవరంలో బూతులు తిట్టించుకుంది.. టీడీపీ నాయకులు. గన్నవరంలో భౌతిక దాడికి గురైంది టీడీపీ కార్యకర్తలు. సో.. బాధితులు ఎవరు? అంటే.. పదో తరగతి పిల్లాడిని అడిగినా.. టీడీపీ నేనని చెబుతాడు.
కానీ… ఏపీ పోలీసులు మాత్రం.. టీడీపీ నేతలేనని అంటున్నారు. వారిపైనే కేసులుపెట్టారు. అవి కూడా హత్యాయత్నం కేసులు పెట్టారు. మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే అంటున్నారు. గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
విజయవాడకు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొమ్మారెడ్డి పట్టాభి సహా మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక, ఎక్కడికక్కడ నాయకులను గృహ నిర్బంధాలకు గురి చేశారు. ఎక్కడో హైదరాబాద్ నుంచి తన ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను దారిలో నే అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇక, ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్నను ఇంటి గడప దాటనివ్వలేదు. ఇదీ..సంగతి!!
This post was last modified on February 21, 2023 2:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…