గన్నవరంలో కాలిపోయింది.. టీడీపీ వాహనాలు. గన్నవరంలో దాడికి గురైంది టీడీపీ కార్యాలయం. గన్నవరంలో బూతులు తిట్టించుకుంది.. టీడీపీ నాయకులు. గన్నవరంలో భౌతిక దాడికి గురైంది టీడీపీ కార్యకర్తలు. సో.. బాధితులు ఎవరు? అంటే.. పదో తరగతి పిల్లాడిని అడిగినా.. టీడీపీ నేనని చెబుతాడు.
కానీ… ఏపీ పోలీసులు మాత్రం.. టీడీపీ నేతలేనని అంటున్నారు. వారిపైనే కేసులుపెట్టారు. అవి కూడా హత్యాయత్నం కేసులు పెట్టారు. మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే అంటున్నారు. గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
విజయవాడకు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొమ్మారెడ్డి పట్టాభి సహా మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక, ఎక్కడికక్కడ నాయకులను గృహ నిర్బంధాలకు గురి చేశారు. ఎక్కడో హైదరాబాద్ నుంచి తన ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను దారిలో నే అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇక, ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్నను ఇంటి గడప దాటనివ్వలేదు. ఇదీ..సంగతి!!
This post was last modified on February 21, 2023 2:01 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…