Political News

ముఖ్య‌మంత్రి ప‌వ‌నే.. తేల్చేసిన హ‌రిరామ‌జోగ‌య్య‌

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా..టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని.. కాపు సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల కు సంబంధించి ఒక స‌ర్వే రిపోర్టును మీడియాకు విడుద‌ల చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్ప‌కూల‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. జ‌గ‌న్‌కు ఆయ‌న పార్టీకి కేవ‌లం 55 స్థానాల్లోనే విజ‌యం దక్కుతుంద‌ని తేల్చి చెప్పారు.

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తుతో ఫ‌లితాలు తారుమారు కావ‌డం త‌థ్య‌మ‌ని వెల్ల‌డించారు. టీడీపీ 70 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని జోగ‌య్య తెలిపారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ 50 స్థానాల్లో విజ‌యం సాధిస్తార‌ని.. దీంతో ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. వారాహి యాత్ర న ప్రారంభించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం మ‌రింత పెరుగుతుంద‌ని జోగ‌య్య వివ‌రించారు.

ఒంటరిగా పోటీ చేస్తే..

ఒక‌వేళ ఎలాంటి పొత్తులూ లేకుండానే జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తే.. 20 స్థానాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతు ంద‌ని జోగ‌య్య అంచ‌నా వేశారు. అలానే టీడీపీ కూడా ఒంట‌రి పోరు చేస్తే.. ఆ పార్టీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని లెక్క గ‌ట్టారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

వారాహి ఎఫెక్ట్ ఇదీ..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వారాహి బ‌స్సు యాత్ర ప్రారంభిస్తే.. భారీ మార్పులు చోటు చేసుకుంటాయ‌ని.. జోగ‌య్య అంచ‌నా వేశారు. ఈ యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య 35కు పెరుగుతుందన్నారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక‌, అధికార పార్టీ వైసీపీ ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని తేల్చారు. సీట్లు 80కి తగ్గుతాయని పేర్కొన్నారు.

This post was last modified on February 21, 2023 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

3 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

3 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago