రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని.. కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఎన్నికల కు సంబంధించి ఒక సర్వే రిపోర్టును మీడియాకు విడుదల చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయమని తెలిపారు. జగన్కు ఆయన పార్టీకి కేవలం 55 స్థానాల్లోనే విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు.
జనసేన-టీడీపీ పొత్తుతో ఫలితాలు తారుమారు కావడం తథ్యమని వెల్లడించారు. టీడీపీ 70 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని జోగయ్య తెలిపారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్ 50 స్థానాల్లో విజయం సాధిస్తారని.. దీంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వెల్లడించారు. వారాహి యాత్ర న ప్రారంభించడం ద్వారా.. ప్రజల్లో జనసేన ప్రభావం మరింత పెరుగుతుందని జోగయ్య వివరించారు.
ఒంటరిగా పోటీ చేస్తే..
ఒకవేళ ఎలాంటి పొత్తులూ లేకుండానే జనసేన ఎన్నికలకు వెళ్తే.. 20 స్థానాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతు ందని జోగయ్య అంచనా వేశారు. అలానే టీడీపీ కూడా ఒంటరి పోరు చేస్తే.. ఆ పార్టీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని లెక్క గట్టారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
వారాహి ఎఫెక్ట్ ఇదీ..
జనసేన అధినేత పవన్ వారాహి బస్సు యాత్ర ప్రారంభిస్తే.. భారీ మార్పులు చోటు చేసుకుంటాయని.. జోగయ్య అంచనా వేశారు. ఈ యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య 35కు పెరుగుతుందన్నారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక, అధికార పార్టీ వైసీపీ ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని తేల్చారు. సీట్లు 80కి తగ్గుతాయని పేర్కొన్నారు.
This post was last modified on February 21, 2023 1:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…