Political News

ముఖ్య‌మంత్రి ప‌వ‌నే.. తేల్చేసిన హ‌రిరామ‌జోగ‌య్య‌

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా..టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని.. కాపు సేన వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల కు సంబంధించి ఒక స‌ర్వే రిపోర్టును మీడియాకు విడుద‌ల చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్ప‌కూల‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. జ‌గ‌న్‌కు ఆయ‌న పార్టీకి కేవ‌లం 55 స్థానాల్లోనే విజ‌యం దక్కుతుంద‌ని తేల్చి చెప్పారు.

జ‌న‌సేన‌-టీడీపీ పొత్తుతో ఫ‌లితాలు తారుమారు కావ‌డం త‌థ్య‌మ‌ని వెల్ల‌డించారు. టీడీపీ 70 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని జోగ‌య్య తెలిపారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ 50 స్థానాల్లో విజ‌యం సాధిస్తార‌ని.. దీంతో ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. వారాహి యాత్ర న ప్రారంభించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం మ‌రింత పెరుగుతుంద‌ని జోగ‌య్య వివ‌రించారు.

ఒంటరిగా పోటీ చేస్తే..

ఒక‌వేళ ఎలాంటి పొత్తులూ లేకుండానే జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తే.. 20 స్థానాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతు ంద‌ని జోగ‌య్య అంచ‌నా వేశారు. అలానే టీడీపీ కూడా ఒంట‌రి పోరు చేస్తే.. ఆ పార్టీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని లెక్క గ‌ట్టారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

వారాహి ఎఫెక్ట్ ఇదీ..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వారాహి బ‌స్సు యాత్ర ప్రారంభిస్తే.. భారీ మార్పులు చోటు చేసుకుంటాయ‌ని.. జోగ‌య్య అంచ‌నా వేశారు. ఈ యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య 35కు పెరుగుతుందన్నారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక‌, అధికార పార్టీ వైసీపీ ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని తేల్చారు. సీట్లు 80కి తగ్గుతాయని పేర్కొన్నారు.

This post was last modified on February 21, 2023 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

52 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago