రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని.. కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఎన్నికల కు సంబంధించి ఒక సర్వే రిపోర్టును మీడియాకు విడుదల చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయమని తెలిపారు. జగన్కు ఆయన పార్టీకి కేవలం 55 స్థానాల్లోనే విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు.
జనసేన-టీడీపీ పొత్తుతో ఫలితాలు తారుమారు కావడం తథ్యమని వెల్లడించారు. టీడీపీ 70 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని జోగయ్య తెలిపారు. అదేసమయంలో జనసేన అధినేత పవన్ 50 స్థానాల్లో విజయం సాధిస్తారని.. దీంతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వెల్లడించారు. వారాహి యాత్ర న ప్రారంభించడం ద్వారా.. ప్రజల్లో జనసేన ప్రభావం మరింత పెరుగుతుందని జోగయ్య వివరించారు.
ఒంటరిగా పోటీ చేస్తే..
ఒకవేళ ఎలాంటి పొత్తులూ లేకుండానే జనసేన ఎన్నికలకు వెళ్తే.. 20 స్థానాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతు ందని జోగయ్య అంచనా వేశారు. అలానే టీడీపీ కూడా ఒంటరి పోరు చేస్తే.. ఆ పార్టీకి 38 శాతం ఓట్లతో 55 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అధికార వైసీపీకి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని లెక్క గట్టారు. ఇతరులకు 1 శాతం సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
వారాహి ఎఫెక్ట్ ఇదీ..
జనసేన అధినేత పవన్ వారాహి బస్సు యాత్ర ప్రారంభిస్తే.. భారీ మార్పులు చోటు చేసుకుంటాయని.. జోగయ్య అంచనా వేశారు. ఈ యాత్ర పూర్తయ్యే నాటికి జనసేన ఓట్ల శాతం 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్ల సంఖ్య 35కు పెరుగుతుందన్నారు. అలాగే టీడీపీకి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని, కానీ 60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక, అధికార పార్టీ వైసీపీ ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని తేల్చారు. సీట్లు 80కి తగ్గుతాయని పేర్కొన్నారు.
This post was last modified on February 21, 2023 1:36 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…