కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవరు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కిందట ఉమ్మడి తూర్పు గోదావరిలో జరిగిన కాపు నాడు సమావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాలనే విషయంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నారు. నిజానికి టీడీపీలో కొందరు కీలక నేతలు వ్యతిరేకిస్తున్నా.. కన్నాను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ఇది కాపులను తమవైపు తిప్పుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ.. జగన్ కూడా కాపులను మచ్చిక చేసుకునేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన కాపులు.. క్షత్రియులకు ఎమ్మెల్సీ కోటాలను రిజర్వ్ చేసినట్టు చెబుతున్నారు.
రెండు సామాజిక వర్గాలకు రెండేసి చొప్పున ఎమ్మెల్సీ సీట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తద్వారా.. కాపులను, మరో కీలక సామాజిక వర్గం క్షత్రియులను కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ… కాపులు మాత్రం శాంతించే ప్రయత్నం కనిపించడం లేదు. కన్నాతో టీడీపీలో జోష్ పెరుగుతుందని భావించినా.. కాపులు దీనిపై మౌనంగా ఉండడం గమనార్హం.
కాపులు వస్తారు.. కన్నాను బలపరుస్తారనే వ్యూహం చంద్రబాబు కు ఉన్నప్పటికీ.. ఈ తరహా ప్రయత్నాలు అయితే.. పార్టీలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై కాపులు.. పార్టీల్లోనూ కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది కనుక.. ఆదిశగా వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కానీ, ఏమేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంటుంది.
This post was last modified on February 21, 2023 1:06 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…