కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవరు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కిందట ఉమ్మడి తూర్పు గోదావరిలో జరిగిన కాపు నాడు సమావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాలనే విషయంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నారు. నిజానికి టీడీపీలో కొందరు కీలక నేతలు వ్యతిరేకిస్తున్నా.. కన్నాను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. ఇది కాపులను తమవైపు తిప్పుతుందని ఆయన భావిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ.. జగన్ కూడా కాపులను మచ్చిక చేసుకునేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన కాపులు.. క్షత్రియులకు ఎమ్మెల్సీ కోటాలను రిజర్వ్ చేసినట్టు చెబుతున్నారు.
రెండు సామాజిక వర్గాలకు రెండేసి చొప్పున ఎమ్మెల్సీ సీట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తద్వారా.. కాపులను, మరో కీలక సామాజిక వర్గం క్షత్రియులను కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ… కాపులు మాత్రం శాంతించే ప్రయత్నం కనిపించడం లేదు. కన్నాతో టీడీపీలో జోష్ పెరుగుతుందని భావించినా.. కాపులు దీనిపై మౌనంగా ఉండడం గమనార్హం.
కాపులు వస్తారు.. కన్నాను బలపరుస్తారనే వ్యూహం చంద్రబాబు కు ఉన్నప్పటికీ.. ఈ తరహా ప్రయత్నాలు అయితే.. పార్టీలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై కాపులు.. పార్టీల్లోనూ కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది కనుక.. ఆదిశగా వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కానీ, ఏమేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంటుంది.
This post was last modified on February 21, 2023 1:06 pm
నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…