తెలంగాణ బీజేపీ ఫైర్బ్రాండ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని.. ఆయనకు పదే పదే ఫోన్లు కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు.
విషయం ఏంటంటే..
ఇటీవల కాలంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయడం లేదని.. పదే పదే మొరాయిస్తోందని రాజాసింగ్ తెలిపారు. దీనిని మార్చాలని కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలని ఆయన నేరుగా సీఎం కేసీఆర్ను కోరారు. అయితే రాజాసింగ్ విజ్ఞప్తిని ప్రషభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన అదే కారులో ప్రగతి భవన్కు వెళ్లి.. అక్కడ హల్ చల్ చేశారు. కారును అక్కడే వదిలేసి వచ్చారు. దీంతో పోలీసులు సదరు కారును స్టేషన్కు తరలించారు.
ఇదిలావుంటే.. తదుపరి రోజు అసెంబ్లీకి రాజాసింగ్ నేరుగా బుల్లెట్ పై రావడం.. తనకు కారు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని ఆరోపించడం తెలిసిందే. తాజాగా ఆయన తనకు ప్రాణ హాని ఉందంటూ.. వ్యాఖ్యలు చేశారు.
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. “నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి” అని ట్వీట్ చేశారు. మరి దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…