తెలంగాణ బీజేపీ ఫైర్బ్రాండ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని.. ఆయనకు పదే పదే ఫోన్లు కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు.
విషయం ఏంటంటే..
ఇటీవల కాలంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయడం లేదని.. పదే పదే మొరాయిస్తోందని రాజాసింగ్ తెలిపారు. దీనిని మార్చాలని కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలని ఆయన నేరుగా సీఎం కేసీఆర్ను కోరారు. అయితే రాజాసింగ్ విజ్ఞప్తిని ప్రషభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన అదే కారులో ప్రగతి భవన్కు వెళ్లి.. అక్కడ హల్ చల్ చేశారు. కారును అక్కడే వదిలేసి వచ్చారు. దీంతో పోలీసులు సదరు కారును స్టేషన్కు తరలించారు.
ఇదిలావుంటే.. తదుపరి రోజు అసెంబ్లీకి రాజాసింగ్ నేరుగా బుల్లెట్ పై రావడం.. తనకు కారు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని ఆరోపించడం తెలిసిందే. తాజాగా ఆయన తనకు ప్రాణ హాని ఉందంటూ.. వ్యాఖ్యలు చేశారు.
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. “నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి” అని ట్వీట్ చేశారు. మరి దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on February 21, 2023 9:18 am
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…