Political News

న‌న్ను చంపేస్తామంటున్నారు.. రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్‌

తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. త‌న‌ను చంపేస్తామ‌ని కొంద‌రు బెదిరిస్తున్నార‌ని.. ఆయ‌నకు ప‌దే ప‌దే ఫోన్లు కూడా చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను రాజాసింగ్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.

విష‌యం ఏంటంటే..

ఇటీవ‌ల కాలంలో త‌న‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు ప‌నిచేయ‌డం లేద‌ని.. ప‌దే ప‌దే మొరాయిస్తోంద‌ని రాజాసింగ్ తెలిపారు. దీనిని మార్చాల‌ని కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాల‌ని ఆయ‌న నేరుగా సీఎం కేసీఆర్‌ను కోరారు. అయితే రాజాసింగ్ విజ్ఞ‌ప్తిని ప్ర‌ష‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న అదే కారులో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి.. అక్క‌డ హ‌ల్ చ‌ల్ చేశారు. కారును అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చారు. దీంతో పోలీసులు స‌ద‌రు కారును స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఇదిలావుంటే.. త‌దుప‌రి రోజు అసెంబ్లీకి రాజాసింగ్ నేరుగా బుల్లెట్ పై రావ‌డం.. త‌న‌కు కారు ఇవ్వ‌డంలో సీఎం కేసీఆర్ తాత్సారం చేస్తున్నార‌ని ఆరోపించ‌డం తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ.. వ్యాఖ్య‌లు చేశారు.

తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని రాజాసింగ్‌ వెల్లడించారు. “నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3.34 గంటలకు బెదిరింపు కాల్‌ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్‌ కాల్‌ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి” అని ట్వీట్‌ చేశారు. మ‌రి దీనిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on February 21, 2023 9:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago