Political News

మర్రి రాజశేఖర్‌కు మళ్లీ నిరాశేనా?

ఏపీలో, వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మర్రి రాజశేఖర్ అనే చెప్పుకోవాలి. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న మర్రి రాజశేఖర్ 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ మర్రికే టికెట్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ విడదల రజిని ఒక్కసారిగా రేసులోకి వచ్చి టికెట్ ఎగరేసుకుపోయారు. ప్రత్తిపాటి పుల్లారావును ఆర్థికంగా ఎదుర్కోలేరన్న కారణంతో మర్రికి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో విడదల రజినికి టికెట్ ఇవ్వడం, ఆమె గెలవడం జరిగిపోయాయి.

అయితే, విడదల రజినికి టికెట్ ఇచ్చే సమయంలో ఎన్నికల తరువాత ఎమ్మెల్సీని చేస్తానని మర్రికి జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు… ఎన్నికల ప్రచార సభల్లోనూ జగన్ ఇదే విషయం చెబుతూ వచ్చారు. ఎమ్మెల్సీని చేయడమే కాదు మర్రి రాజశేఖర్‌ను మంత్రిని కూడా చేస్తానని చెప్పారు. కానీ, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. సరికదా.. విడదల రజినిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

అనంతరం విడదల రజినిని మర్రిని ఏమాత్రం పట్టించుకోకుండా నియోజకవర్గంలో తన పెత్తనం సాగించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు మర్రి పక్షం వహించగా నియోజకవర్గంలో విడదల రజిని ఒక వర్గంగా… మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయులు మరో వర్గంగా నిత్యం నియోజకవర్గంలో రచ్చ నడిచేది.

కారణమేదైనా కానీ ఎన్నికల ముందు స్వయంగా జగన్ హామీ ఇచ్చినా కూడా మర్రికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మర్రి రాజశేఖర్ సామాజికవర్గమైన కమ్మ కులానికే చెందిన తలశిల రఘురాం‌కు జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కానీ మర్రికి మాత్రం మొండి చేయి చూపించారు.

ఇప్పుడు పెద్దసంఖ్యలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం స్థానిక సంస్థలలో, అసెంబ్లీలో వైసీపీ బలం పుష్కలంగా ఉండడంతో వైసీపీలో ఈ పదవులకు డిమాండ్ ఏర్పడింది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం మర్రికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ఆశ ఆయన అనుచరులలో కనిపిస్తున్నప్పటికీ వైసీపీ పెద్దల లెక్కల మాత్రం వేరేగా ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదిస్తున్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్ల వెంకట్రావులను సంతృప్తిపరిచి వంశీకి వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు లేకుండా చేయాలన్నది జగన్ యోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో యార్లగడ్డ వెంకటరావుకు ఎమ్మెల్సీ ఇస్తారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అదే నిజమైతే మర్రి రాజశేఖర్‌‌‌కు ఈసారి కూడా అవకాశం రానట్లే. యార్లగడ్డ, మర్రి ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో యార్లగడ్డకు ఎమ్మెల్సీ ఇస్తే మరో కమ్మ నేతకు అవకాశం ఇవ్వడం కష్టమే. అంటే మర్రి రాజశేఖర్‌కు దారులు మూసుకుపోయినట్లే అవుతుంది.

Satya

Recent Posts

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

4 minutes ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

16 minutes ago

కర్ణుడి కాంట్రావర్సి… కల్కి దర్శకుడి కౌంటర్

విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…

58 minutes ago

పైరసీని నిలువరించడం సాధ్యమవుతుందా

ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…

2 hours ago

ఆరేళ్ల మనుమరాలితో కారు డ్రైవింగ్… ఎస్ఐ సస్పెండ్

చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…

2 hours ago

ఇది పెళ్లి తెచ్చిన లక్కా…

టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…

2 hours ago