నందమూరి తారకరత్న మరణించిన సందర్భంగా అతడి పార్థివ దేహాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిల కలయిక అందరి దృష్టినీ ఆకర్షించింది. బాబు, సాయి రెడ్డి పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం.. ఆ తర్వాత చంద్రబాబు కారు ఎక్కబోతుండగా అక్కడికి కూడా సాయిరెడ్డి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
సందర్భం ఏదైనప్పటికీ.. నిత్యం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ల మీద ట్విట్టర్ వేదికగా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసే సాయిరెడ్డి ఆయన్ని ఇలా కలిసి మాట్లాడడం చాలామందికి మింగుడు పడలేదు. తనను అన్నేసి మాటలు అనే సాయిరెడ్డిని చంద్రబాబు ఎందుకు దగ్గరికి రానిచ్చారని తెలుగుదేశం వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వైసీపీ వాళ్లు సైతం రాజకీయంగా తీవ్రంగా విభేదించే వ్యక్తితో ఈ సాన్నిహిత్యం ఏంటనే ప్రశ్నలు సంధించారు.
ఐతే ఈ మొత్తం వ్యవహారంలో నష్టం జరిగి ఉంటే అది సాయిరెడ్డికే తప్ప చంద్రబాబుకు కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే ఎప్పుడూ చంద్రబాబును, లోకేష్ను సాయిరెడ్డి తిడుతుంటారు తప్ప.. బాబు సాయి రెడ్డి ప్రస్తావన తీసుకురారు. బాబు ఎవరినైనా రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారే తప్ప వ్యక్తిగతంగా శత్రువులా చూడరనడానికి సాయిరెడ్డితో వ్యవహరించిన తీరే నిదర్శనం. తనను ఎన్ని మాటలు అన్నా కూడా తమ ఇద్దరికీ బంధువు అయిన తారకరత్న చనిపోయిన సందర్భం కాబట్టి సాయిరెడ్డి పక్కన కూర్చున్నా, మాట్లాడినా దాన్ని మరో రకంగా చూడలేదు. సాయిరెడ్డిని వ్యక్తిగత శత్రువుగా భావించి ఉంటే ఆయన దగ్గరకు రానిచ్చేవారు కాదు. తనను అన్ని మాటలు అన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా సాయిరెడ్డిని గౌరవించడం ద్వారా బాబు తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్లు అయింది.
ఇక చంద్రబాబును, లోకేష్ను దారుణాతి దారుణమైన మాటలు అని.. ఇప్పుడు చంద్రబాబును కలవడానికి సాయిరెడ్డికి మొహం చెల్లి ఉండకూడదు. కానీ అవసరం దృష్ట్యా కలిశారు, మాట్లాడారు. ఇది ఆయనకే ఇబ్బందికరం. అన్నింటికీ మించి ఇలాంటివి జగన్కు అస్సలు రుచించవు. ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గించిన జగన్.. తాజా పరిణామాలతో ఆయన మీద మరింత శీతకన్నేస్తే ఆశ్చర్యం లేదు.
This post was last modified on February 20, 2023 11:41 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…