Political News

ఫ‌స్ట్ టైం.. మోడీకి షాక్‌.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే.. దేశానికి అధినేత‌. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు.. శుభాకాంక్ష‌లు.. అభినంద‌న‌లు .. ఆయ‌న ద‌ర్శ‌నం అయితే చాలు.. అనుకునే నాయ‌కులు అబ్బో.. అనిపించే అతిథి మ‌ర్యాదలు. ఇక‌, ఆయ‌న కోరితే అనుమ‌తు లేం ఖర్మ ఏపీ వంటి రాష్ట్రాల్లో అయితే.. రాజ్య‌స‌భ టికెట్లు, ఆయ‌న మిత్రుల‌కు పోర్టులు, కార్పెట్లు వ‌గైరా వ‌గైనా ఇచ్చేస్తున్న ప‌రిస్థితి తెలిసిందే. అయితే.. తొలిసారి న‌రేంద్ర మోడీని ధిక్క‌రించిన రాష్ట్రం ఒక‌టుంది. అదే మేఘాల‌య‌. ఈ నెల 27న అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం కోసం ప్ర‌ధాని మోడీ అక్క‌డ ప‌ర్య‌టించాల‌ని అనుకున్నారు.

కానీ, అంద‌రిలా తానెందుకు ఉండాల‌ని అనుకున్నారో.. ఏమో.. అక్క‌డి ముఖ్య‌మంత్రి.. మోడీ రోడ్ షోకు.. బ‌హిరంగ స‌భ‌కు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేశారు. దీంతో షాక్ తిన‌డం మోడీ వంతైంది. మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీకి రెడీ అయ్యారు. అయితే, అక్క‌డి ప్ర‌భుత్వం అనుమతి నిరాకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని ఈ నెల‌ 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది.

అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే స్పందించారు. “పీఏ సంగ్మా స్టేడియంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం సరికాదు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడ మైదానంలో నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. అందుకు ప్రధాని మోడీ సభకు అనుమతివ్వలేదు. పత్యామ్నాయ వేదికగా అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నాం.” అని తెలిపారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయింది. ‘పీఏ సంగ్మా స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అందుబాటులో లేదని ఎలా చెబుతారు. కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా బీజేపీని చూసి భయపడుతున్నారు. వారు మేఘాలయలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధాని ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు.. కానీ మేఘాలయ ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమ మనసును మార్చుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నా యి.’ అని బీజేపీ నేత ఒక‌రు విమ‌ర్శించారు.

This post was last modified on February 20, 2023 11:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

2 hours ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

3 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

4 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

5 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

5 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

5 hours ago