Political News

డైలామాలో కాపులు.. కిం క‌ర్త‌వ్యం?

అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజ‌మే. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైల‌మాలో ప‌డిపోయింది. తాము ఒంట‌రిగా ఎద‌గాల‌ని.. రాజ‌కీయంగా శాసించాల‌ని.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే ముఖ్య‌మంత్రి కావాల‌ని కొన్నాళ్లుగా కాపులు ఉద్య‌మిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వారంతా డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి కాపులు జ‌న‌సేన పార్టీపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నేది వారి చిర‌కాల వాంఛ‌గా మారిపోయింది. ఆ మాట‌కొస్తే… మెగా కుటుంబం నుంచి ఒక‌రిని కీల‌క ప‌ద‌విలో చూడాల‌నేదివారి కోరిక‌. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట కాపు నాడు నాయ‌కులు భేటీ అయి ప‌వ‌న్ కోసం ఏమైనా చేయాల‌నే తీర్మానం చేసుకున్నారు.

కానీ, ప‌వ‌న్ మాత్రం టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది కాపులు తాజాగా చేసిన ఆరోప‌ణ‌. రెండు రోజుల కింద‌ట జ‌గ్గ‌పేట‌లో నిర్వ‌హించిన అతి ర‌హ‌స్య స‌మావేశంలో ప‌వ‌న్‌పై గుర్రుగా ఉన్న నాయ‌కులు నోరు విప్పేశారు. ఇప్పుడు మ‌నం ఏం చేయాలి? అనేది వారి మ‌ధ్య ప్ర‌ధానంగా సాగిన సంభాష‌ణ‌. కాపు నాయ‌కులే కాపుల‌కు ద్రోహం చేస్తున్నార‌నే భావ‌న వారి నుంచిరావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం కూడా!

కాపులు రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్ ఒక వంతెన‌గా మారుతార‌ని.. ఆశించామ‌ని, కానీ, ఆయ‌న టీడీపీతో పొత్తు కోస‌మే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఒక‌టి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేస్తే.. స‌రిపోతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఈ స‌మావేశంలో కొంద‌రు నాయ‌కులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని క‌న్నాపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు తెలిసింది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాపులు వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సిందిపోయి.. మ‌ళ్లీ ఏదో ఒక పార్టీకి అంట‌కాగితే.. మ‌ళ్లీ స‌మ‌స్య‌లు య‌థాతథంగానే మిగిలిపోతాయ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై మాత్రం ఎవ‌రూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణ‌యానికి రాలేక పోయారు. మ‌రోసారి భేటీ త‌ర్వాత ఏదో ఒక విష‌యాన్ని నిర్ణ‌యించాల‌ని తీర్మానం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on February 20, 2023 11:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

22 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

26 minutes ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

57 minutes ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

1 hour ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

1 hour ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

2 hours ago