అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజమే. కాపు సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైలమాలో పడిపోయింది. తాము ఒంటరిగా ఎదగాలని.. రాజకీయంగా శాసించాలని.. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కొన్నాళ్లుగా కాపులు ఉద్యమిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తరచుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను గమనిస్తే.. వారంతా డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది.
నిజానికి కాపులు జనసేన పార్టీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది వారి చిరకాల వాంఛగా మారిపోయింది. ఆ మాటకొస్తే… మెగా కుటుంబం నుంచి ఒకరిని కీలక పదవిలో చూడాలనేదివారి కోరిక. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ను ముఖ్యమంత్రిని చేయాలని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందట కాపు నాడు నాయకులు భేటీ అయి పవన్ కోసం ఏమైనా చేయాలనే తీర్మానం చేసుకున్నారు.
కానీ, పవన్ మాత్రం టీడీపీ ఇతర పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారనేది కాపులు తాజాగా చేసిన ఆరోపణ. రెండు రోజుల కిందట జగ్గపేటలో నిర్వహించిన అతి రహస్య సమావేశంలో పవన్పై గుర్రుగా ఉన్న నాయకులు నోరు విప్పేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేది వారి మధ్య ప్రధానంగా సాగిన సంభాషణ. కాపు నాయకులే కాపులకు ద్రోహం చేస్తున్నారనే భావన వారి నుంచిరావడం ఆశ్చర్యంగా అనిపించినా నిజం కూడా!
కాపులు రాజకీయంగా ఎదిగేందుకు పవన్ ఒక వంతెనగా మారుతారని.. ఆశించామని, కానీ, ఆయన టీడీపీతో పొత్తు కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఒకరిద్దరు నాయకులు బాహాటంగానే విమర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపులకు న్యాయం జరుగుతుందా? అని మరికొందరు వ్యాఖ్యానించారు. కాపులను మచ్చిక చేసుకునేందుకు ఒకటి రెండు మంత్రి పదవులు ఇచ్చేస్తే.. సరిపోతుందా? అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కొందరు నాయకులు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కాపులను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని కన్నాపై ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితిలో కాపులు వ్యక్తిగతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయాల్సిందిపోయి.. మళ్లీ ఏదో ఒక పార్టీకి అంటకాగితే.. మళ్లీ సమస్యలు యథాతథంగానే మిగిలిపోతాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై మాత్రం ఎవరూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణయానికి రాలేక పోయారు. మరోసారి భేటీ తర్వాత ఏదో ఒక విషయాన్ని నిర్ణయించాలని తీర్మానం చేసుకోవడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…