అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజమే. కాపు సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైలమాలో పడిపోయింది. తాము ఒంటరిగా ఎదగాలని.. రాజకీయంగా శాసించాలని.. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కొన్నాళ్లుగా కాపులు ఉద్యమిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తరచుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను గమనిస్తే.. వారంతా డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది.
నిజానికి కాపులు జనసేన పార్టీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది వారి చిరకాల వాంఛగా మారిపోయింది. ఆ మాటకొస్తే… మెగా కుటుంబం నుంచి ఒకరిని కీలక పదవిలో చూడాలనేదివారి కోరిక. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ను ముఖ్యమంత్రిని చేయాలని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందట కాపు నాడు నాయకులు భేటీ అయి పవన్ కోసం ఏమైనా చేయాలనే తీర్మానం చేసుకున్నారు.
కానీ, పవన్ మాత్రం టీడీపీ ఇతర పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారనేది కాపులు తాజాగా చేసిన ఆరోపణ. రెండు రోజుల కిందట జగ్గపేటలో నిర్వహించిన అతి రహస్య సమావేశంలో పవన్పై గుర్రుగా ఉన్న నాయకులు నోరు విప్పేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేది వారి మధ్య ప్రధానంగా సాగిన సంభాషణ. కాపు నాయకులే కాపులకు ద్రోహం చేస్తున్నారనే భావన వారి నుంచిరావడం ఆశ్చర్యంగా అనిపించినా నిజం కూడా!
కాపులు రాజకీయంగా ఎదిగేందుకు పవన్ ఒక వంతెనగా మారుతారని.. ఆశించామని, కానీ, ఆయన టీడీపీతో పొత్తు కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఒకరిద్దరు నాయకులు బాహాటంగానే విమర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపులకు న్యాయం జరుగుతుందా? అని మరికొందరు వ్యాఖ్యానించారు. కాపులను మచ్చిక చేసుకునేందుకు ఒకటి రెండు మంత్రి పదవులు ఇచ్చేస్తే.. సరిపోతుందా? అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో కొందరు నాయకులు కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కాపులను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని కన్నాపై ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితిలో కాపులు వ్యక్తిగతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేయాల్సిందిపోయి.. మళ్లీ ఏదో ఒక పార్టీకి అంటకాగితే.. మళ్లీ సమస్యలు యథాతథంగానే మిగిలిపోతాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాలనే విషయంపై మాత్రం ఎవరూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణయానికి రాలేక పోయారు. మరోసారి భేటీ తర్వాత ఏదో ఒక విషయాన్ని నిర్ణయించాలని తీర్మానం చేసుకోవడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 20, 2023 11:55 pm
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…
హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో…