Political News

డైలామాలో కాపులు.. కిం క‌ర్త‌వ్యం?

అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజ‌మే. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైల‌మాలో ప‌డిపోయింది. తాము ఒంట‌రిగా ఎద‌గాల‌ని.. రాజ‌కీయంగా శాసించాల‌ని.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే ముఖ్య‌మంత్రి కావాల‌ని కొన్నాళ్లుగా కాపులు ఉద్య‌మిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వారంతా డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి కాపులు జ‌న‌సేన పార్టీపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నేది వారి చిర‌కాల వాంఛ‌గా మారిపోయింది. ఆ మాట‌కొస్తే… మెగా కుటుంబం నుంచి ఒక‌రిని కీల‌క ప‌ద‌విలో చూడాల‌నేదివారి కోరిక‌. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట కాపు నాడు నాయ‌కులు భేటీ అయి ప‌వ‌న్ కోసం ఏమైనా చేయాల‌నే తీర్మానం చేసుకున్నారు.

కానీ, ప‌వ‌న్ మాత్రం టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది కాపులు తాజాగా చేసిన ఆరోప‌ణ‌. రెండు రోజుల కింద‌ట జ‌గ్గ‌పేట‌లో నిర్వ‌హించిన అతి ర‌హ‌స్య స‌మావేశంలో ప‌వ‌న్‌పై గుర్రుగా ఉన్న నాయ‌కులు నోరు విప్పేశారు. ఇప్పుడు మ‌నం ఏం చేయాలి? అనేది వారి మ‌ధ్య ప్ర‌ధానంగా సాగిన సంభాష‌ణ‌. కాపు నాయ‌కులే కాపుల‌కు ద్రోహం చేస్తున్నార‌నే భావ‌న వారి నుంచిరావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం కూడా!

కాపులు రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్ ఒక వంతెన‌గా మారుతార‌ని.. ఆశించామ‌ని, కానీ, ఆయ‌న టీడీపీతో పొత్తు కోస‌మే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఒక‌టి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేస్తే.. స‌రిపోతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఈ స‌మావేశంలో కొంద‌రు నాయ‌కులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని క‌న్నాపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు తెలిసింది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాపులు వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సిందిపోయి.. మ‌ళ్లీ ఏదో ఒక పార్టీకి అంట‌కాగితే.. మ‌ళ్లీ స‌మ‌స్య‌లు య‌థాతథంగానే మిగిలిపోతాయ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై మాత్రం ఎవ‌రూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణ‌యానికి రాలేక పోయారు. మ‌రోసారి భేటీ త‌ర్వాత ఏదో ఒక విష‌యాన్ని నిర్ణ‌యించాల‌ని తీర్మానం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

5 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

9 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

10 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

10 hours ago