Political News

వంశీకి అన్ని వైపులా సమస్యలేనా..

గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు…

వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే పనులు చేసుకుంటూ వెళ్తున్నానని వంశీ చెప్పినప్పటికీ వైసీపీ నేతలు వినే అవకాశం కనిపించడం లేదు. వంశీకి 2024లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించకూడదని గతేడాది ఉద్యమించిన వెంకట్రావు వర్గం.. వంశీకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతోంది..

తాజాగా గన్నవరం టీడీపీ నేతలు వంశీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఇటీవలి కామెంట్స్ అన్నింటినీ కలిపి విమర్శిస్తున్నారు. తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టకపోతే వంశీ ఎక్కడ ఉండేవారని టీడీపీ నేత దొంతు చిన్నా ప్రశ్నించారు. భువనేశ్వరిని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని క్షమించే ప్రసక్తే లేదని ప్రకటించారు. వంశీ ఎక్కడ నుంచి వచ్చారో, ఆయన ఎలా ఎదిగారో గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ లేకపోతే వంశీ ఎక్కడ ఉండేవారో అర్థం చేసుకుంటే ఆయన అసలు బండారం బయట పడుతుందన్నారు…

వంశీని ఓడించడానికి చంద్రబాబు లోకేష్ రావాల్సిన అవసరం లేదని, ఆయన్ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. లోకేష్ మినిష్టర్ గా ఉన్పప్పుడే గన్నవరానికి నిధులు ఇచ్చారని, వైసీపీ హయాంలో పైసా కూడా విదిల్చలేదని చెప్పుకొచ్చారు. పక్కనున్న వాళ్లంతా తన వాళ్లనుకుని వంశీ విర్రవీగిపోతున్నారని అది ముమ్మాటికి నిజం కాదని దొంతు చిన్న హెచ్చరించారు..

వంశీ ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. టీడీపీలో గెలిచిన వంశీ రాజకీయ అవసరాల కోసం వైసీపీలో చేరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడయ్యారు. పైగా నోటి దురుసుతనంతో నిత్యం ఏవేవో మాట్లాడుతూ అందరికీ దూరమయ్యారు. పరిస్థితులను అధ్యయనం చేస్తూ కొంతకాలం పాటు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు వంశీపై ఫుల్ లెన్త్ అటాక్ మొదలెట్టారు. వైసీపీలోనూ అంతర్గత పోరు కారణంగా వంశీకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు… అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం డౌటేనని చెబుతున్నారు…

This post was last modified on February 20, 2023 1:34 pm

Share
Show comments

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago