గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు…
వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే పనులు చేసుకుంటూ వెళ్తున్నానని వంశీ చెప్పినప్పటికీ వైసీపీ నేతలు వినే అవకాశం కనిపించడం లేదు. వంశీకి 2024లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించకూడదని గతేడాది ఉద్యమించిన వెంకట్రావు వర్గం.. వంశీకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతోంది..
తాజాగా గన్నవరం టీడీపీ నేతలు వంశీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఇటీవలి కామెంట్స్ అన్నింటినీ కలిపి విమర్శిస్తున్నారు. తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టకపోతే వంశీ ఎక్కడ ఉండేవారని టీడీపీ నేత దొంతు చిన్నా ప్రశ్నించారు. భువనేశ్వరిని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని క్షమించే ప్రసక్తే లేదని ప్రకటించారు. వంశీ ఎక్కడ నుంచి వచ్చారో, ఆయన ఎలా ఎదిగారో గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ లేకపోతే వంశీ ఎక్కడ ఉండేవారో అర్థం చేసుకుంటే ఆయన అసలు బండారం బయట పడుతుందన్నారు…
వంశీని ఓడించడానికి చంద్రబాబు లోకేష్ రావాల్సిన అవసరం లేదని, ఆయన్ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. లోకేష్ మినిష్టర్ గా ఉన్పప్పుడే గన్నవరానికి నిధులు ఇచ్చారని, వైసీపీ హయాంలో పైసా కూడా విదిల్చలేదని చెప్పుకొచ్చారు. పక్కనున్న వాళ్లంతా తన వాళ్లనుకుని వంశీ విర్రవీగిపోతున్నారని అది ముమ్మాటికి నిజం కాదని దొంతు చిన్న హెచ్చరించారు..
వంశీ ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. టీడీపీలో గెలిచిన వంశీ రాజకీయ అవసరాల కోసం వైసీపీలో చేరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడయ్యారు. పైగా నోటి దురుసుతనంతో నిత్యం ఏవేవో మాట్లాడుతూ అందరికీ దూరమయ్యారు. పరిస్థితులను అధ్యయనం చేస్తూ కొంతకాలం పాటు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు వంశీపై ఫుల్ లెన్త్ అటాక్ మొదలెట్టారు. వైసీపీలోనూ అంతర్గత పోరు కారణంగా వంశీకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు… అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం డౌటేనని చెబుతున్నారు…
This post was last modified on February 20, 2023 1:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త…
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. తిరుపతి పరిధిలోని జీవకోన సమీప మొండోడికోన…
సినీ రంగంలో కొందరికి కొందరితో చిత్రమైన బంధం మొదలవుతుంది. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టుగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అడివి…
ఒక నెల ముందు వరకు మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఇష్టుడిగా ఉండేవాడు. ఆచార్య, గేమ్ చేంజర్…
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
యుద్ధం.. సామాన్య ప్రజల ప్రాణాల్ని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. శతాబ్దాల ఘన చరిత్రకు సజీవ…