Political News

వంశీకి అన్ని వైపులా సమస్యలేనా..

గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు…

వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే పనులు చేసుకుంటూ వెళ్తున్నానని వంశీ చెప్పినప్పటికీ వైసీపీ నేతలు వినే అవకాశం కనిపించడం లేదు. వంశీకి 2024లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు వర్గం వంశీని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించకూడదని గతేడాది ఉద్యమించిన వెంకట్రావు వర్గం.. వంశీకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా 30 వేల మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతోంది..

తాజాగా గన్నవరం టీడీపీ నేతలు వంశీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఇటీవలి కామెంట్స్ అన్నింటినీ కలిపి విమర్శిస్తున్నారు. తిట్ల దండకం అందుకున్నారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టకపోతే వంశీ ఎక్కడ ఉండేవారని టీడీపీ నేత దొంతు చిన్నా ప్రశ్నించారు. భువనేశ్వరిని నోటికొచ్చినట్లు మాట్లాడిన వంశీని క్షమించే ప్రసక్తే లేదని ప్రకటించారు. వంశీ ఎక్కడ నుంచి వచ్చారో, ఆయన ఎలా ఎదిగారో గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ లేకపోతే వంశీ ఎక్కడ ఉండేవారో అర్థం చేసుకుంటే ఆయన అసలు బండారం బయట పడుతుందన్నారు…

వంశీని ఓడించడానికి చంద్రబాబు లోకేష్ రావాల్సిన అవసరం లేదని, ఆయన్ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. లోకేష్ మినిష్టర్ గా ఉన్పప్పుడే గన్నవరానికి నిధులు ఇచ్చారని, వైసీపీ హయాంలో పైసా కూడా విదిల్చలేదని చెప్పుకొచ్చారు. పక్కనున్న వాళ్లంతా తన వాళ్లనుకుని వంశీ విర్రవీగిపోతున్నారని అది ముమ్మాటికి నిజం కాదని దొంతు చిన్న హెచ్చరించారు..

వంశీ ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. టీడీపీలో గెలిచిన వంశీ రాజకీయ అవసరాల కోసం వైసీపీలో చేరి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడయ్యారు. పైగా నోటి దురుసుతనంతో నిత్యం ఏవేవో మాట్లాడుతూ అందరికీ దూరమయ్యారు. పరిస్థితులను అధ్యయనం చేస్తూ కొంతకాలం పాటు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు వంశీపై ఫుల్ లెన్త్ అటాక్ మొదలెట్టారు. వైసీపీలోనూ అంతర్గత పోరు కారణంగా వంశీకి ఇప్పుడు ఓటమి భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు… అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం డౌటేనని చెబుతున్నారు…

This post was last modified on February 20, 2023 1:34 pm

Share
Show comments

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago