రాజకీయాలన్న తర్వాత ప్రచారం కీలకం. కానీ.. అదే ఒక ధోరణిగా మారకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి తీరు పీక్స్ కు చేరుకుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు.. సర్కారీ స్కూళ్లకు పార్టీ జెండా రంగుల్ని అద్దేసి వివాదానికి తెర తీసిన ఆయన.. ఈ మధ్యన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటం వరకు దాన్ని తీసుకెళ్లారు. సర్లే అనుకుంటున్న వేళ.. మొబైల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలన్న ఏపీ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదం అలానే ఉన్న వేళ.. మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యులు ఇచ్చే ఓపీ షీట్ల మీద ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోగికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? దాని కోసం వాడాల్సిన మందులేమిటి? అన్నది చీటీ మీద ఉండాలే తప్పించి.. ముఖ్యమంత్రి ఫోటోను వాడాల్సిన అవసరం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రభుత్వం అన్న తర్వాత ప్రచారం చేసుకోవటం తప్పు కాదు.కానీ.. ఎక్కడ చూసినా తన ఫోటోనే ఉండాలన్నట్లుగా ముఖ్యమంత్రి భావించటమే అసలు సమస్యగా మారిందని చెప్పాలి. భూముల్లో పాతే సర్వే రాళ్ల పైనా తన బొమ్మను చెక్కించుకున్న జగన్.. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీదా.. శ్మశానం గోడలు.. కాలనీ ల ఆర్చ్ ల మీదా బొమ్ములు వేయించుకోవటం.. పార్టీ రంగులు వేయటం తెలిసిందే.
ఇప్పటికే ఇలాంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటూ.. ఈ ధోరణి మరీ అతిగా ఉందన్న మాట అనిపించుకున్న ఆయన.. తనకున్న ఫోటోల యావకు పరాకాష్ఠగా ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఓపీ షీట్ల మీదా తన ఫోటోలను ముద్రించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి చేతికి ఓపీ కార్డు ఇస్తారు. దీని పైనా సీఎం జగన్ బొమ్మను ముద్రించారు.
సాధారణంగా రోగులకు ఇచ్చే రికార్డుల్లో వైద్యుల పేర్లు.. వారి విద్యార్హత.. సదరు ఆసుపత్రికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటాయి. వీటి మీద కూడా తన ఫోటో ఉండాలన్న తపన జగన్ కు మంచిది కాదంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న గౌరవం పోతుందన్న మాటవినిపిస్తోంది. మరి.. ఏపీ ప్రభుత్వానికి వందకు పైగా ఉన్న సలహాదారులు.. ఇలాంటి విషయాల్ని ప్రభుత్వానికి ఎందుకు చెప్పరు? వారున్నది ఎందుకు? అన్నది అసలు ప్రశ్నగా మారింది.
This post was last modified on February 20, 2023 12:11 pm
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…