Political News

ఇప్పుడు ఓపీ షీట్ల మీదా జగన్?

రాజకీయాలన్న తర్వాత ప్రచారం కీలకం. కానీ.. అదే ఒక ధోరణిగా మారకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి తీరు పీక్స్ కు చేరుకుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు.. సర్కారీ స్కూళ్లకు పార్టీ జెండా రంగుల్ని అద్దేసి వివాదానికి తెర తీసిన ఆయన.. ఈ మధ్యన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటం వరకు దాన్ని తీసుకెళ్లారు. సర్లే అనుకుంటున్న వేళ.. మొబైల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలన్న ఏపీ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదం అలానే ఉన్న వేళ.. మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యులు ఇచ్చే ఓపీ షీట్ల మీద ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోగికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? దాని కోసం వాడాల్సిన మందులేమిటి? అన్నది చీటీ మీద ఉండాలే తప్పించి.. ముఖ్యమంత్రి ఫోటోను వాడాల్సిన అవసరం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రభుత్వం అన్న తర్వాత ప్రచారం చేసుకోవటం తప్పు కాదు.కానీ.. ఎక్కడ చూసినా తన ఫోటోనే ఉండాలన్నట్లుగా ముఖ్యమంత్రి భావించటమే అసలు సమస్యగా మారిందని చెప్పాలి. భూముల్లో పాతే సర్వే రాళ్ల పైనా తన బొమ్మను చెక్కించుకున్న జగన్.. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీదా.. శ్మశానం గోడలు.. కాలనీ ల ఆర్చ్ ల మీదా బొమ్ములు వేయించుకోవటం.. పార్టీ రంగులు వేయటం తెలిసిందే.

ఇప్పటికే ఇలాంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటూ.. ఈ ధోరణి మరీ అతిగా ఉందన్న మాట అనిపించుకున్న ఆయన.. తనకున్న ఫోటోల యావకు పరాకాష్ఠగా ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఓపీ షీట్ల మీదా తన ఫోటోలను ముద్రించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి చేతికి ఓపీ కార్డు ఇస్తారు. దీని పైనా సీఎం జగన్ బొమ్మను ముద్రించారు.

సాధారణంగా రోగులకు ఇచ్చే రికార్డుల్లో వైద్యుల పేర్లు.. వారి విద్యార్హత.. సదరు ఆసుపత్రికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటాయి. వీటి మీద కూడా తన ఫోటో ఉండాలన్న తపన జగన్ కు మంచిది కాదంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న గౌరవం పోతుందన్న మాటవినిపిస్తోంది. మరి.. ఏపీ ప్రభుత్వానికి వందకు పైగా ఉన్న సలహాదారులు.. ఇలాంటి విషయాల్ని ప్రభుత్వానికి ఎందుకు చెప్పరు? వారున్నది ఎందుకు? అన్నది అసలు ప్రశ్నగా మారింది.

This post was last modified on February 20, 2023 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

3 minutes ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

49 minutes ago

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

3 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

5 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

6 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

9 hours ago