Political News

టీడీపీలో మ‌న‌సు.. వైసీపీలో మ‌నుషులు.. జంపింగ్ ఖాయం!

కొంద‌రు నేత‌లు.. గ‌త 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వివిధ కార‌ణాల‌తో టీడీపీని విడిచి పెట్టి వైసీపీ లోకి చేరిపోయారు. గ‌తంలో వీరిపై ఉన్న కేసులు కావొచ్చు.. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కావొచ్చు. ఏవైనా కూడా అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌భావం చూపించాయి. దీంతో వారంతా కూడా పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొట్టారు. ఇలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే క‌మ్ మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ రావు వంటివారు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వీరిలో శిద్దారాఘ‌వ‌రావు మాత్రం ఇప్పుడు మ‌రోసారి టీడీపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేసేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని.. ఎమ్మెల్యేగానే బ‌రిలో నిలుస్తాన‌ని చంద్ర‌బాబుకు చెప్పారు. అయితే.. అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బ‌లవంతంగానే శిద్దాను.. చంద్ర‌బాబు ఒంగోలుకు పంపారు.

అయితే, శిద్దా మ‌న‌సు మాత్రం ద‌ర్శిపైనే ఉంది. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా.. ద‌ర్శిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న ద‌ర్శి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌, వైసీపీ ఈ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను సైతం కాద‌ని.. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌కు ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నార‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో తాను వైసీపీలో ఉండి కూడా ఉప‌యోగం లేద‌ని భావిస్తున్న శిద్దా.. టీడీపీలోకి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించేసుకున్న‌ట్టుగా ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. దీనిపై ఇప్ప‌టికే మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందుకే చంద్ర‌బాబు కూడా ఇక్క‌డ ఎవ‌రికీ బాధ్య‌త‌లు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. అంటే.. శిద్దా రాఘ‌వ‌రావు.. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌.!!

This post was last modified on February 20, 2023 9:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

49 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago