Political News

టీడీపీలో మ‌న‌సు.. వైసీపీలో మ‌నుషులు.. జంపింగ్ ఖాయం!

కొంద‌రు నేత‌లు.. గ‌త 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వివిధ కార‌ణాల‌తో టీడీపీని విడిచి పెట్టి వైసీపీ లోకి చేరిపోయారు. గ‌తంలో వీరిపై ఉన్న కేసులు కావొచ్చు.. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కావొచ్చు. ఏవైనా కూడా అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌భావం చూపించాయి. దీంతో వారంతా కూడా పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొట్టారు. ఇలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే క‌మ్ మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ రావు వంటివారు ఉన్నారు.

అయితే.. ఇప్పుడు వీరిలో శిద్దారాఘ‌వ‌రావు మాత్రం ఇప్పుడు మ‌రోసారి టీడీపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి టీడీపీ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేసేందుకు త‌న‌కు ఇష్టం లేద‌ని.. ఎమ్మెల్యేగానే బ‌రిలో నిలుస్తాన‌ని చంద్ర‌బాబుకు చెప్పారు. అయితే.. అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బ‌లవంతంగానే శిద్దాను.. చంద్ర‌బాబు ఒంగోలుకు పంపారు.

అయితే, శిద్దా మ‌న‌సు మాత్రం ద‌ర్శిపైనే ఉంది. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా.. ద‌ర్శిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న ద‌ర్శి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌, వైసీపీ ఈ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను సైతం కాద‌ని.. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌కు ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నార‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో తాను వైసీపీలో ఉండి కూడా ఉప‌యోగం లేద‌ని భావిస్తున్న శిద్దా.. టీడీపీలోకి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించేసుకున్న‌ట్టుగా ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. దీనిపై ఇప్ప‌టికే మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని.. అందుకే చంద్ర‌బాబు కూడా ఇక్క‌డ ఎవ‌రికీ బాధ్య‌త‌లు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. అంటే.. శిద్దా రాఘ‌వ‌రావు.. త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌చ్చేశాయ‌న్న‌మాట‌.!!

This post was last modified on February 20, 2023 9:33 am

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 minutes ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

36 minutes ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

47 minutes ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

1 hour ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

4 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago